సింగపూర్‌తో భారత్‌ డ్రా

హంగ్‌ తిన్‌ టోర్నీలో భాగంగా సింగపూర్‌తో ఫిఫా అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను భారత్‌ 1-1 గోల్స్‌తో డ్రా చేసుకుంది. శనివారం జరిగిన ఈ పోరులో 37వ....

Published : 25 Sep 2022 03:20 IST

హో చి మిన్‌: హంగ్‌ తిన్‌ టోర్నీలో భాగంగా సింగపూర్‌తో ఫిఫా అంతర్జాతీయ స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను భారత్‌ 1-1 గోల్స్‌తో డ్రా చేసుకుంది. శనివారం జరిగిన ఈ పోరులో 37వ నిమిషంలో ఫాండి చేసిన గోల్‌తో సింగపూర్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఆ జట్టు ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైంది. 43వ నిమిషంలో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అందించిన పాస్‌ను సద్వినియోగం చేసూ అషిఖ్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు ఆధిక్యం కోసం ప్రయత్నించి విఫలం కావడంతో మ్యాచ్‌ డ్రా అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని