రన్నరప్గా శ్రీజ-స్నేహిత్ జోడీ
జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ-ఫిదేల్ స్నేహిత్ (తెలంగాణ) రన్నరప్గా నిలిచారు. శనివారం మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ-స్నేహిత్ 8-11, 5-11, 6-11తో కృత్విక సిన్హా-మనుష్ (గుజరాత్) చేతిలో ఓడారు.
సూరత్: జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో ఆకుల శ్రీజ-ఫిదేల్ స్నేహిత్ (తెలంగాణ) రన్నరప్గా నిలిచారు. శనివారం మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ-స్నేహిత్ 8-11, 5-11, 6-11తో కృత్విక సిన్హా-మనుష్ (గుజరాత్) చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్లోనూ శ్రీజకు నిరాశే ఎదురైంది. తుది పోరులో శ్రీజ 8-11, 7-11, 8-11, 14-12, 9-11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ టైటిల్ను హర్మీత్ దేశాయ్ (గుజరాత్) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 11-8, 11-4, 11-7, 11-8తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా)ను ఓడించాడు. మహిళల, పురుషుల డబుల్స్ టైటిళ్లను బెంగాల్ క్రీడాకారులు సుతీర్థ-అహిక, జీత్-రోనిత్ కైవసం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్