ఏం చేస్తారో?
హైదరాబాద్లో టీ20 మ్యాచ్.. టికెట్ల వివాదం, తొక్కిసలాట కారణంగా ఆటకు ముందే ఈ మ్యాచ్ వేడెక్కింది. టికెట్ల విక్రయంలో సరైన ప్రణాళిక లేక, నిర్వహణలో వైఫల్యం కారణంగా అభిమానులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
హైదరాబాద్లో టీ20 మ్యాచ్.. టికెట్ల వివాదం, తొక్కిసలాట కారణంగా ఆటకు ముందే ఈ మ్యాచ్ వేడెక్కింది. టికెట్ల విక్రయంలో సరైన ప్రణాళిక లేక, నిర్వహణలో వైఫల్యం కారణంగా అభిమానులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. క్రికెట్పై ప్రేమ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభమవుతున్నా ఇంకా మ్యాచ్ టికెట్ల వివాదం సద్దుమణగలేదు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) దాదాపు 13 వేల టికెట్ల లెక్క చెప్పని సంగతి తెలిసిందే. మరోవైపు బ్లాక్లో భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.1500 టికెట్ను రూ.5 నుంచి 10 వేలకు బ్లాక్లో అమ్ముతున్నట్లు సమాచారం. స్టేడియంలో ఏర్పాట్లపైనా విమర్శలు వస్తున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్. కరోనా కారణంగా మూడేళ్ల పాటు స్టేడియం నిర్వహణ పట్టించుకోలేదని స్వయంగా హెచ్సీఏ ప్రతినిధులే చెప్పారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ సజావుగా సాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!