పాక్ 3 పరుగుల తేడాతో..
ఇంగ్లాండ్తో ఏడు టీ20ల సిరీస్లో పాకిస్థాన్ మళ్లీ పుంజుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో 3 పరుగుల తేడాతో నెగ్గిన ఆ జట్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. మొదట రిజ్వాన్ (88: 67 బంతుల్లో 9×4, 1×6) మెరుపులతో పాక్ 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.
కరాచి: ఇంగ్లాండ్తో ఏడు టీ20ల సిరీస్లో పాకిస్థాన్ మళ్లీ పుంజుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో 3 పరుగుల తేడాతో నెగ్గిన ఆ జట్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. మొదట రిజ్వాన్ (88: 67 బంతుల్లో 9×4, 1×6) మెరుపులతో పాక్ 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. అనంతరం నవాజ్ (3/35), హస్నైన్ (2/40)ల ధాటికి ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. డకెట్ (34), బ్రూక్ (34), మొయిన్ అలీ (29), డాసన్ (34) పోరాడినా ఇంగ్లాండ్ను గెలిపించలేకపోయారు. 3 వికెట్లు చేతిలో ఉండగా 2 ఓవర్లలో 9 పరుగులే అవసరం కాగా.. రవూఫ్ (3/32) 19వ ఓవర్లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను గట్టి దెబ్బ తీశాడు. 5 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన స్థితిలో టాప్లీ (0) రనౌటవడంతో ఆ జట్టు కథ ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)