స్వీడన్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఎక్స్‌పోజర్‌ టూర్‌కు వెళ్లిన భారత అండర్‌-17 మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 1-3తో స్వీడన్‌ చేతిలో పరాజయంపాలైంది. ఆరంభంలో గట్టిగానే పోటీలో నిలిచిన భారత్‌... క్రమంగా వెనుకబడింది. భారత్‌ తరఫున

Published : 27 Sep 2022 02:09 IST

దిల్లీ: ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఎక్స్‌పోజర్‌ టూర్‌కు వెళ్లిన భారత అండర్‌-17 మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 1-3తో స్వీడన్‌ చేతిలో పరాజయంపాలైంది. ఆరంభంలో గట్టిగానే పోటీలో నిలిచిన భారత్‌... క్రమంగా వెనుకబడింది. భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుధా టిర్కీ (62వ) సాధించింది. స్వీడన్‌ జట్టులో గ్రామ్‌ఫోర్స్‌ (44వ), ఫ్రిగ్రెన్‌ (52వ), ఆస్ట్రామ్‌ (54వ) తలో గోల్‌ కొట్టారు. ఈ మ్యాచ్‌ స్పెయిన్‌లోని గిరోనాలో జరిగింది. అక్టోబరులో జరిగే అండర్‌-17 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని