నగదు, నగలు పోయాయి
ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా తనకు కేటాయించిన హోటల్ గదిలో దొంగతనం జరిగిందని భారత మహిళా క్రికెటర్ తానియా భాటియా సోమవారం పేర్కొంది. నగదు, నగలు, కార్డులతో సహా ముఖ్యమైన వస్తువులు పోయాయని ఆమె తెలిపింది. లండన్లోని మారియట్ హోటల్లో టీమ్ఇండియా బస చేసింది. అక్కడే ఈ దొంగతనం
లండన్లో దొంగతనం జరిగిందన్న తానియా
దిల్లీ: ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా తనకు కేటాయించిన హోటల్ గదిలో దొంగతనం జరిగిందని భారత మహిళా క్రికెటర్ తానియా భాటియా సోమవారం పేర్కొంది. నగదు, నగలు, కార్డులతో సహా ముఖ్యమైన వస్తువులు పోయాయని ఆమె తెలిపింది. లండన్లోని మారియట్ హోటల్లో టీమ్ఇండియా బస చేసింది. అక్కడే ఈ దొంగతనం జరిగినట్లు ఆమె ట్విటర్లో పోస్టు చేసింది. ‘‘లండన్లోని మారియట్ హోటల్ మేనేజ్మెంట్ తీరు షాక్తో పాటు నిరాశ కలిగించింది. ఇటీవల భారత క్రికెట్ జట్టు తరపున ఆ హోటల్లో బస చేశా. ఎవరో నా వ్యక్తిగత గదిలోకి ప్రవేశించి నగదు, కార్డులు, చేతి గడియారాలు, నగలు ఉన్న బ్యాగును దొంగిలించారు. అక్కడ సురక్షితంగా లేదు. ఈ ఘటనపై త్వరగా విచారణ జరిపి, పరిష్కారం చూపిస్తారని నమ్ముతున్నా. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు భాగస్వామి అయిన హోటల్లో భద్రతా వైఫల్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాళ్లు కూడా జాగ్రత్తపడతారని అనుకుంటున్నా’’ అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన హోటల్.. తానియాకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్.. పేసర్ జులన్ గోస్వామికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఘన వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ను దీప్తి శర్మ మన్కడింగ్ రనౌట్ చేయడం ఇప్పటికే చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు