ఇకపై క్రీజులో ఉంటా

భారత్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఆఖరిదైన మూడో వన్డేలో తనను దీప్తిశర్మ మన్కడింగ్‌ చేయడంపై ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ‘‘ఈ వేసవికి ఆసక్తికర ముగింపు.

Published : 28 Sep 2022 02:45 IST

లండన్‌: భారత్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఆఖరిదైన మూడో వన్డేలో తనను దీప్తిశర్మ మన్కడింగ్‌ చేయడంపై ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ‘‘ఈ వేసవికి ఆసక్తికర ముగింపు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ జెర్సీ ధరించి బరిలో దిగడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇకపై క్రీజులోనే ఉంటా’’ అని డీన్‌ ఆ పోస్టులో పేర్కొంది. చార్లీ రనౌట్‌ ఘటనపై ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తాము ఒకటికి రెండుసార్లు హెచ్చరించిన తర్వాతే డీన్‌ను రనౌట్‌ చేసినట్లు దీప్తి తాజాగా చెప్పగా.. దీప్తి అబద్దం ఆడుతోందని ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హీదర్‌ నైట్‌ అంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని