అక్టోబర్ 6 నుంచి ప్రపంచకప్ టికెట్లు
వచ్చే ఏడాది మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్కు ఇంకా రంగం సిద్ధం కానప్పటికీ టికెట్ల విక్రయం మాత్రం మొదలు కానుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్కు
న్యూయార్క్: వచ్చే ఏడాది మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్కు ఇంకా రంగం సిద్ధం కానప్పటికీ టికెట్ల విక్రయం మాత్రం మొదలు కానుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల ప్యాకేజీ వచ్చే నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 6 నుంచి 12 వరకు ప్రపంచకప్ స్పాన్సర్ అయిన వీసా కార్డు వినియోగదారులు ఈ ప్యాకేజీ కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెల 13 నుంచి 21 వరకు అందరికీ ఈ అవకాశం దక్కుతుంది. ఒక్క మ్యాచ్కు సంబంధించిన టికెట్లు నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి. 2023 జులై 20న ఆరంభమయ్యే ఈ ప్రపంచకప్ డ్రాను వచ్చే నెల 22న న్యూజిలాండ్లో ప్రకటిస్తారు. మొత్తం 32 జట్లు కప్పు కోసం తలపడతాయి. తొమ్మిది నగరాల్లో కలిపి 10 స్టేడియాల్లో 64 మ్యాచ్లు జరుగుతాయి. ఆగస్టు 20న ఫైనల్ను సిడ్నీలో నిర్వహిస్తారు. టోర్నీలో చివరి మూడు స్థానాలు దక్కించుకోవడం కోసం 10 జట్ల అంతర్ ఖండం ప్లేఆఫ్స్ ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు