అత్యధిక పరుగుల వీరుడు సూర్య
అంతర్జాతీయ మ్యాచ్ల్లో అదరగొడుతున్న టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 732 పరుగులు
దిల్లీ: అంతర్జాతీయ మ్యాచ్ల్లో అదరగొడుతున్న టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 732 పరుగులు సాధించిన సూర్య.. 2018లో శిఖర్ ధావన్ (689 పరుగులు) నమోదు చేసిన రికార్డును అధగమించాడు. కెరీర్లో 32 టీ20 మ్యాచ్లాడిన సూర్య మొత్తం 976 పరుగులు రాబట్టాడు. మరో 24 చేస్తే 1000 పరుగుల క్లబ్లో చేరతాడు. ఈ ఏడాది సూర్య 180.29 స్ట్రైక్రేటుతో ఆడటం విశేషం. అతని కెరీర్ స్ట్రైక్రేట్ (173.35) కంటే ఇది ఎక్కువ. ఇప్పటికే అతను 57 సిక్సర్లు, 88 బౌండరీలు బాదాడు. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా సూర్య సొంతమైంది. సూర్య 45 సిక్సర్లతో మహ్మద్ రిజ్వాన్ (42- 2021)ను అధిగమించాడు. 42 సిక్సర్ల కోసం రిజ్వాన్కు 26 ఇన్నింగ్స్లు అవసరమవగా.. సూర్య 21 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్