ఇంగ్లాండ్ గెలుపు
ఏడు టీ20ల సిరీస్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సిరీస్లో వెనుకబడ్డ ఇంగ్లాండ్ మళ్లీ పుంజుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన ఆరో టీ20లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను 3-3తో సమం చేసింది.
సిరీస్ మళ్లీ సమం
లాహోర్: ఏడు టీ20ల సిరీస్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సిరీస్లో వెనుకబడ్డ ఇంగ్లాండ్ మళ్లీ పుంజుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన ఆరో టీ20లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను 3-3తో సమం చేసింది. మొదట కెప్టెన్ బాబర్ అజామ్ (87 నాటౌట్; 59 బంతుల్లో 7×4, 3×6) మెరుపులతో పాక్ 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. సామ్ కరన్ (2/26), డేవిడ్ విల్లీ (2/32) ఆ జట్టును దెబ్బ తీశారు. అనంతరం ఫిల్ సాల్ట్ (88 నాటౌట్; 41 బంతుల్లో 13×4, 3×6) చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేసిన సాల్ట్.. హేల్స్ (27), మలన్ (26), డకెట్ (26 నాటౌట్)లతో భాగస్వామ్యాలు నెలకొల్పి ఇంగ్లాండ్ను గెలిపించాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (2/34) సత్తా చాటాడు. నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్