Shoaib Akhtar: పాక్ తొలి రౌండ్లోనే పోతుందేమో..: షోయబ్ అక్తర్
బాబర్ అజామ్, రిజ్వాన్తో పాటు పాకిస్థాన్ బ్యాట్స్మెనందరినీ టీ20 ప్రపంచకప్లో ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లతో పరీక్షిస్తారని మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు.
లాహోర్: బాబర్ అజామ్, రిజ్వాన్తో పాటు పాకిస్థాన్ బ్యాట్స్మెనందరినీ టీ20 ప్రపంచకప్లో ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లతో పరీక్షిస్తారని మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తారని పాక్ బ్యాట్స్మెన్ను అతడు ప్రశ్నించాడు.
‘‘నేను ఇంతకుముందే చెప్పినట్లు.. పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్లో తొలి రౌండ్లోనే నిష్క్రమిస్తుందన్న భయం కలుగుతోంది. ప్రపంచకప్లో మిగతా జట్లు పాకిస్థాన్పై ఏం చేయబోతున్నాయో అందరికీ తెలుసు. బాబర్, రిజ్వాన్, ఇఫ్తికార్.. ఇలా పాక్ బ్యాట్స్మెన్ అందరికీ బౌన్సర్లు వేస్తారు. ఆస్ట్రేలియాలో బౌన్సర్లు వేయరని అనుకోవద్దు. అవి మాత్రమే వేస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు?’’ అని అక్తర్ అన్నాడు. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బాగా లేదని, ఓపెనర్లు రాణించకపోతే ఒత్తిడికి గురవుతుందని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!