నిరాశ కలిగించింది

టీ20 ప్రపంచకప్‌కు దూరమవడం నిరాశ కలిగించిందని టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకోగానే జట్టును ఉత్సాహపరుస్తానని తెలిపాడు.

Published : 05 Oct 2022 02:53 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌కు దూరమవడం నిరాశ కలిగించిందని టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకోగానే జట్టును ఉత్సాహపరుస్తానని తెలిపాడు. ‘‘ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భాగం కానందుకు నిరాశగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. నేను కోలుకోగానే ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా బాగా ఆడేలా నా వంతు ప్రోత్సాహం అందిస్తా’’ అని బుమ్రా ట్వీట్‌ చేశాడు. ప్రపంచకప్‌ కోసం బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. స్టాండ్‌బైలుగా ఎంపికైన దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమిల్లో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని