వదలని వాన

న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటనను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌ను సవ్యంగా సాగనివ్వని వాన.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ దెబ్బతీస్తోంది.

Updated : 28 Nov 2022 04:29 IST

భారత్‌, కివీస్‌ రెండో వన్డే రద్దు

హామిల్టన్‌: న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటనను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌ను సవ్యంగా సాగనివ్వని వాన.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ దెబ్బతీస్తోంది. వాతావరణం అనుకూలించక ఆదివారం రెండో వన్డే రద్దయింది. వాన రెండోసారి ఆటకు అంతరాయం కలిగించే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. అప్పటికి సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌; 25 బంతుల్లో 2×4, 3×6) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 1×6) చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి వన్డే బుధవారం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని