రుతురాజ్ మరో సెంచరీ
రుతురాజ్ గైక్వాడ్ జోరు మామూలుగా లేదు. గత మ్యాచ్లో ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో సహా అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్.. మరోసారి శతకం (168; 126 బంతుల్లో 18×4, 6×6) బాదడంతో విజయ్హజారె ట్రోఫీలో మహారాష్ట్ర ఫైనల్కు దూసుకెళ్లింది.
ఫైనల్లో మహారాష్ట్ర
అహ్మదాబాద్: రుతురాజ్ గైక్వాడ్ జోరు మామూలుగా లేదు. గత మ్యాచ్లో ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో సహా అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్.. మరోసారి శతకం (168; 126 బంతుల్లో 18×4, 6×6) బాదడంతో విజయ్హజారె ట్రోఫీలో మహారాష్ట్ర ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంను ఓడించింది. మొదట రుతురాజ్, అంకిత్ (110; 89 బంతుల్లో 10×4, 2×6) సెంచరీలు సాధించడంతో మహారాష్ట్ర 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. ఛేదనలో అస్సాం 8 వికెట్లకు 338 చేసి త్రుటిలో ఓడింది. మరో సెమీస్లో ఉనద్కత్ (4/26) విజృంభించడంతో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించింది. మొదట కర్ణాటక 171 పరుగులకే ఆలౌట్ కాగా.. సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు