అంజుమ్‌ ఖాతాలో రజతం

ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నీ (కైరో)లో మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ రజతం సాధించింది.

Published : 04 Dec 2022 03:10 IST

దిల్లీ: ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నీ (కైరో)లో మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ఈ భారత షూటర్‌ 14-16తో అనా జాన్సెన్‌ (జర్మనీ) చేతిలో ఓడింది. క్వాలిఫికేషన్‌లో జాతీయ రికార్డు (591 పాయింట్లు)తో నాలుగో స్థానంలో నిలిచిన అంజుమ్‌.. ర్యాంకింగ్‌ రౌండ్లో 412.9తో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీనా క్రిస్టెన్‌ (స్విట్జర్లాండ్‌, 354.3) అయిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో పతకం. ఇంతకుముందు రుద్రాంక్ష్ (10 మీ. ఎయిర్‌ రైఫిల్‌) స్వర్ణం నెగ్గాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని