స్వదేశానికి పంత్‌

వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ను భారత వన్డే జట్టు నుంచి అర్ధంతరంగా విడుదల చేశారు. ‘‘బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్‌ను విడుదల చేశారు.

Published : 05 Dec 2022 02:43 IST

మిర్పూర్‌: వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ను భారత వన్డే జట్టు నుంచి అర్ధంతరంగా విడుదల చేశారు. ‘‘బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్‌ను విడుదల చేశారు. టెస్టు సిరీస్‌కు అతడు తిరిగి జట్టుతో చేరతాడు’’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పంత్‌ స్థానంలో ఎవరినీ జట్టుకు ఎంపిక చేయలేదు. పంత్‌ను విడుదల చేయడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి తీసుకోని అన్ని ఫార్మాట్ల ఆటగాడు పంత్‌ మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు