రోహిత్ స్థానంలో ఈశ్వరన్!
భారత జట్టు సారథి రోహిత్శర్మ స్థానంలో ఇండియా-ఎ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశముంది! బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా జట్టులో ఈశ్వరన్కు చోటు కల్పించనున్నారని సమాచారం.
దిల్లీ: భారత జట్టు సారథి రోహిత్శర్మ స్థానంలో ఇండియా-ఎ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశముంది! బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా జట్టులో ఈశ్వరన్కు చోటు కల్పించనున్నారని సమాచారం. బంగ్లాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో రోహిత్ ఎడమ చేయి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెస్టు సిరీస్కు రోహిత్ దూరమయ్యాడు. ‘‘బంగ్లాదేశ్లో ఎ-టెస్టు సిరీస్లో ఇండియా-ఎ కెప్టెన్ ఈశ్వరన్ వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అతను ఓపెనర్ కూడా. రెండో అనధికార టెస్టు ముగియగానే చట్గావ్లో ఈశ్వరన్ టీమ్ఇండియాతో కలవనున్నాడు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపాడు. ఈశ్వరన్ మొదటి అనధికారిక టెస్టులో 141, రెండో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 157 పరుగులతో సత్తాచాటాడు. గాయపడిన మహ్మద్ షమి స్థానంలో బంగాల్ పేసర్ ముకేశ్కుమార్ లేదా ఉమ్రాన్ మాలిక్ను జట్టులోకి తీసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్పై మండిపడుతున్న ఫ్యాన్స్!