BCCI: బంగ్లా పర్యటన తర్వాత బీసీసీఐ సమీక్ష!

ఇటీవల భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శన అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్నే జీర్ణించుకోలేకపోతుంటే..

Updated : 09 Dec 2022 07:59 IST

ముంబయి: ఇటీవల భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శన అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్నే జీర్ణించుకోలేకపోతుంటే.. తాజాగా బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోవడం పెద్ద షాక్‌. టీమ్‌ఇండియా ఇలా చిత్తవుతుంటే.. బీసీసీఐ ఏం చేస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ పర్యటన పూర్తి కాగానే బీసీసీఐ కార్యవర్గం.. జట్టు యాజమాన్యం, ప్రధాన ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవలి పరాభవాలపై వివరణ కోరడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన, సెలక్షన్‌ తదితర అంశాలపై సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ‘‘ప్రపంచకప్‌ ముగియగానే సమీక్ష నిర్వహించాలనుకున్నాం. కానీ కొందరు ఆఫీస్‌ బేరర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడింది. బంగ్లాదేశ్‌ నుంచి జట్టు స్వదేశానికి రాగానే సమీక్ష ఉంటుంది’’ అని ఒక బీసీసీఐ అధికారి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని