‘అతడు తెందూల్కర్ను అధిగమిస్తాడు’
ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ టెస్టు క్రికెట్లో ఆల్టైమ్ దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ తెందూల్కర్ రికార్డులను అధిగమించే వీలుందని, అతడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ జియోఫ్రే బాయ్కాట్ అన్నారు...
లండన్: ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ టెస్టు క్రికెట్లో ఆల్టైమ్ దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ తెందూల్కర్ రికార్డులను అధిగమించే వీలుందని, అతడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ జియోఫ్రే బాయ్కాట్ కొనియాడారు. ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో రూట్ 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. 30 ఏళ్ల జోరూట్ ఇప్పటికే 99 టెస్టులు ఆడాడు. అలాగే ఈ ఫార్మాట్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ ‘ది టెలిగ్రాఫ్’కు రాసిన కథనంలో ఇలా పేర్కొన్నాడు.
‘ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రూట్.. 200 టెస్టులు ఆడగలడు. క్రికెట్ దిగ్గజం సచిన్ కన్నా ఎక్కువ పరుగులు చేయగలడు. ఇప్పుడతడి వయసు 30 ఏళ్లే. ఇప్పటికే 99 టెస్టుల్లో 8,249 పరుగులు చేశాడు. అతడికి తీవ్ర గాయాలు కానంత వరకూ తెందూల్కర్ సాధించిన 15,921 పరుగులను అధిగమించకపోవడానికి ఇతర కారణాలు లేవు. అలాగే రూట్ను మాజీ దిగ్గజాలతో కాకుండా నేటి తరం ఆటగాళ్లతో పోల్చాలి’ అని బాయ్కాట్ అన్నారు.
‘విరాట్ కోహ్లీ, స్టీవ్స్మిత్, కేన్ విలియమ్సన్.. రూట్తో సమాంతర ఆటగాళ్లు. వీళ్లు కూడా సచిన్ చేసినన్ని పరుగులు చేయగలరు. రూట్ను వీరితోనే పోల్చి చూడాలి. పాత తరం దిగ్గజాలతో కాదు. ఎందుకంటే ప్రతీ ఆటగాడు ఆయా పరిస్థితులను బట్టి తయారవుతాడు. ఇక ఈ శ్రీలంక పర్యటనకు ముందు వరకూ రూట్ సరిగా ఆడలేకపోయాడు. అయితే, కరోనాతో లభించిన విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సిరీస్లో అతడు ఆడుతుంటే తనకి తెలియకుండానే ప్రతీ బంతికీ పరుగులు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపించింది. కానీ, ఆస్ట్రేలియా పేస్ను అతడు ఎదుర్కోవడంలోనే అసలైన సవాలు ఎదురుకానుంది’ అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు