Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ 2023 (ODI WC 2023) జరగనుంది. దీంతో కప్ను నెగ్గాలనే కృతనిశ్చయంతో టీమ్ఇండియా (Team India) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ సన్నాహకాలను టీమ్ఇండియా ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లను భారత్ కైవసం చేసుకొంది. వన్డే ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నట్లు సెలెక్షన్ కమిటీ చెప్పింది. కానీ ఆ జాబితా మాత్రం బయటకు రాలేదు. పైన రెండు సిరీసుల్లోనూ టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ మాత్రం ఆడలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టులో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్కు అవకాశం దొరికింది. వీరిద్దరూ ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించారు. దీంతో శిఖర్కు అవకాశం దొరుకుతుందో.. లేదో..? అనే అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. తాజాగా దీనిపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్లో స్పందించాడు. వన్డే క్రికెట్లో ధావన్ను అగ్రస్థాయి ఆటగాడిగా అభివర్ణించాడు.
‘‘గతంలో టాప్ -3 బ్యాటర్లు విఫలమైనప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరంతా అగ్రశ్రేణి ఆటగాళ్లు. అయితే మనం ఎక్కువగా రోహిత్, విరాట్ గురించే మాట్లాడుతుంటాం. కానీ, శిఖర్ ధావన్ కూడా టాప్ బ్యాటర్. అతడు తన బాధ్యతలను నిశ్శబ్దంగా పూర్తి చేస్తాడు. అతడు ఇటీవల ఆడటం లేదు. మరి ధావన్ లేని లోటు టీమ్ఇండియాకు శూన్యంగా మారనుందా..? శిఖర్ ధావన్ను మళ్లీ జట్టులోకి తీసుకొస్తారా..? లేదా డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్కే ఇంకా అవకాశాలు ఇస్తూ ఉంటారా? అనేది వేచి చూడాలి. అయితే భారీ స్కోరు చేశాడనే కారణంగా ఓ ఆటగాడికి మద్దతు ఇచ్చే బదులు.. జట్టుకు ఏం అవసరమో చూడాలి. ఒత్తిడిలో ఎవరు బాగా ఆడతారనేది గమనించాలి’’ అని అశ్విన్ తెలిపాడు. శిఖర్ ధావన్ 167 వన్డేల్లో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ కేవలం 13 మ్యాచుల్లోనే 507 పరుగులు సాధించాడు. ఇందులో డబుల్ సెంచరీతోపాటు మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇద్దరూ లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్లు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.