రోహిత్ సహా ఐదుగురికి ఖేల్రత్న
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్రత్న ఇస్తున్నామని తెలిపింది.....
సాక్షి, మీరాబాయికి అర్జున తిరస్కరించిన ప్రభుత్వం
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్రత్న ఇస్తున్నామని తెలిపింది.
విశ్రాంత న్యాయమూర్తి ముకుందమ్ శర్మ నేతృత్వంలోని పురస్కారాల ఎంపిక కమిటీ మొత్తం 29 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్రత్న ప్రతిపాదించింది. 2016 రియో ఒలింపిక్స్లో కాంస్యం అందించిన సాక్షి మాలిక్, 2017 వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మీరాబాయి చాను పేర్లనూ అర్జునకు ప్రతిపాదించింది. తుది నిర్ణయం మాత్రం క్రీడామంత్రి కిరణ్ రిజిజుకు వదిలేసింది.
సాక్షి, మీరాబాయి గతంలోనే ఖేల్రత్న అందుకోవడంలో ఎంపిక కమిటీ నిర్ణయంపై కొందరు పెదవి విరిచారు. అత్యున్నత పురస్కారమైన ఖేల్రత్న వచ్చాక అంతకన్నా తక్కువ విలువైన అర్జున ఎందుకని ప్రశ్నించారు. కాగా కమిటీ ప్రతిపాదించిన ఐదుగురికీ కేంద్రం ఖేల్రత్నకు ఎంపిక చేయడం గమనార్హం.
క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, పారాలింపిక్ స్వర్ణపతక విజేత మరియప్పన్ తంగవేలు, టీటీ క్రీడాకారిణి మనికా బాత్రా, మహిళల హాకీ సారథి రాణి రాంపాల్కు పురస్కారాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అందిస్తారు. ఈ సారి కొవిడ్-19 ఉండటంతో వర్చువల్గా వేడుక నిర్వహించనున్నారు.
అర్జున విజేతలు వీరే
ఆర్చరీ - అతను దాస్, అథ్లెటిక్స్ - ద్యుతీచంద్, బ్యాడ్మింటన్ - సాత్విక్ సాయిరాజ్, బ్యాడ్మింటన్ - చిరాగ్ చంద్ర శేఖర్ శెట్టి, బాస్కెట్ బాల్ - విశేష్ భ్రిగువంశీ, బాక్సింగ్ - సుబేదార్ మనీష్ కౌశిక్, లోలినా బోర్కే, క్రికెట్-దీప్తి శర్మ, ఇషాంత్ శర్మ, ఇక్వెస్ట్రియన్ -సావంత్ అజయ్ అనంత్, ఫుట్బాల్- సందేశ్ జింగాన్, గోల్ఫ్-అదితి కౌశిక్, హాకీ- ఆకాష్ దీప్ సింగ్, హాకీ-దీపికా, కబ్బడి-దీపక్, ఖో-ఖో-సరికా సుధాకర్, రోయింగ్ -దత్తూన్, పారా షూటింగ్- మనీశ్ నర్వాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ