టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు టీమ్ఇండియా పేస్ పిచ్లపై ఫిర్యాదులు చేయదని, అలాంటప్పుడు స్పిన్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేని ఇంగ్లాండ్ జట్టును కాకుండా పిచ్ను విమర్శించడం ఏమిటని...
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు టీమ్ఇండియా పేస్ పిచ్లపై ఫిర్యాదులు చేయదని.. అలాంటప్పుడు స్పిన్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేని ఇంగ్లాండ్ జట్టును కాకుండా పిచ్ను విమర్శించడం ఏమిటని ఆ జట్టు మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన పింక్బాల్ టెస్టులో టీమ్ఇండియా గురువారం 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై పలువురు క్రికెటర్లు పిచ్ తీరును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన స్వాన్.. టీమ్ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు ఇలాంటి ఫిర్యాదులు చేయదని చెప్పాడు.
‘ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కూడా ఒకింత బాగానే ఆడింది. అయితే, కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. వచ్చేవారం జరగబోయే నాలుగో టెస్టుకు కూడా ఇలాంటి పిచ్చే ఉంటుంది. అందులో వేరే ఉద్దేశమే లేదు. ఇంగ్లాండ్ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. మూడో టెస్టులాగే మళ్లీ తప్పులు చేయొద్దు. పిచ్ బాగా టర్న్ అవుతుందనే కొంటె సాకులు చెప్పొద్దు. అవన్నీ పనికిమాలిన మాటలు. ఇంగ్లాండ్ ఇంకా జాగ్రత్తగా ఆడాలి. అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే మరింత కష్టపడాలి. కోహ్లీ ఇలాగే చేశాడు. అండర్సన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి శక్తిమేరా శ్రమించాడు’ అని స్వాన్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
ఇక ఈ విజయంతో టీమ్ఇండియా సిరీస్లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు