WTC Final: కోహ్లీని తొలగించాలనుకుంటే అది తప్పే!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమి పాలైన నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆ బాధ్యతల నుంచి తొలగించాలనుకుంటే, అది సరికాదని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్స్వాన్ అన్నాడు
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమి పాలైన నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆ బాధ్యతల నుంచి తొలగించాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాబోదని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్స్వాన్ అన్నాడు. టీమ్ఇండియాకు అతడు వెన్నెముకలాంటోడని కొనియాడాడు. తాజాగా కివీస్తో జరిగిన తుదిపోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ కోహ్లీని కెప్టెన్గా తొలగిస్తే, అది నేరమని భావించాడు. భారత సారథి నిజమైన ఛాంపియన్ అని, అతడో సూపర్స్టార్ అని ప్రశంసించాడు. టీమ్ఇండియాను బలంగా తీర్చిదిద్దాడని తెలిపాడు. ఆటపై నిబద్ధతతో ఉన్నాడని, వంద శాతం అంకితభావంతో ఉన్నాడని స్వాన్ గుర్తుచేశాడు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్ కోహ్లీలాంటి మంచి కెప్టెన్ ఉన్నప్పుడు, అతడిని తొలగించాలని నిర్ణయం తీసుకుంటే అదెంత మాత్రం సరైనది కాదు. అది కచ్చితంగా నేరం కిందకే వస్తుంది. భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయం గురించి చూడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్కు సరిగ్గా సన్నద్ధమవ్వకపోవడం వల్లే టీమ్ఇండియా ఓటమిపాలైంది. తుదిపోరుకు ముందు కోహ్లీసేన సౌథాంప్టన్లో ప్రాక్టీస్ మాత్రమే చేసింది. కానీ, ఒక టెస్టుకు సన్నద్ధమవ్వాలంటే అందుకు తగ్గట్టే సరైన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలి. అదే అసలైన సన్నద్ధత. ఈ నేపథ్యంలోనే తుదిపోరులో గెలవడానికి న్యూజిలాండ్ అన్ని అవకాశాలను ముందే తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ మ్యాచ్లో అదే కనిపించింది. అలాగే టీమ్ఇండియాలోనూ పలువురు బ్యాట్స్మెన్ విఫలమయ్యారు’ అని స్వాన్ చెప్పుకొచ్చాడు. కాగా, గతంలో టీమ్ఇండియా ఐసీసీ టోర్నీల్లో విఫలమైనప్పుడు కెప్టెన్గా కోహ్లీని తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తిన సంగతి గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా