IND vs NZ: అతడితో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి: జయంత్ యాదవ్
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి అని యువ ఆటగాడు జయంత్ యాదవ్ అన్నాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం వల్ల చాలా..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో కలిసి బౌలింగ్ చేయడం గొప్ప అనుభూతి అని యువ ఆటగాడు జయంత్ యాదవ్ అన్నాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో జయంత్ యాదవ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
‘సీనియర్ స్పిన్నర్ అశ్విన్తో కలిసి బౌలింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతి. జట్టు విజయం గురించి అతడు చాలా ఆలోచిస్తాడు. ఇలాంటి వారితో బంతిని పంచుకుంటే.. అది మన ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మూడోరోజు చివరి సెషన్లో వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడిన నేను.. నాలుగో రోజు ఉదయం మెరుగైన ప్రదర్శన చేశాను. పిచ్ కూడా పూర్తిగా మారిపోయి స్పిన్కు అనుకూలంగా మారింది. వాంఖడే మైదానం నాకు చాలా ప్రత్యేకమైనది. నేను చివరి సారిగా ఇక్కడ ఆడిన టెస్టులో శతకం బాదాను. టీమ్ఇండియా సాధించిన ఘన విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని జయంత్ యాదవ్ అన్నాడు. నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ను త్వరగా ముగించడంలో జయంత్ యాదవ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 4/49 తో తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.