MS Dhoni : ధోనీ అత్యంత చురుకైన క్రికెట్ మేధావి.. మాజీ సారథిపై ఛాపెల్ ప్రశంసల జల్లు
భారతీయ క్రికెట్ అభిమానులకు గ్రెగ్ ఛాపెల్ గుర్తుండే ఉంటాడు కదా.. భారత ప్రధాన కోచ్గా....
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ క్రికెట్ అభిమానులకు గ్రెగ్ ఛాపెల్ గుర్తుండే ఉంటాడు కదా.. భారత ప్రధాన కోచ్గా (2005-2007) రెండేళ్ల పాటు పని చేసిన ఛాపెల్ వివాదాస్పద నిర్ణయాల దెబ్బకు హేమాహేమీలైన క్రికెటర్లే కుదేలైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్రికెట్ ఛానెల్తో గ్రెగ్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే అత్యంత చురుకైన క్రికెట్ మేధావిగా ధోనీని అభివర్ణించాడు. ‘‘నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీది అద్భుతమైన నైపుణ్యం. ఇదే అతడి సమకాలీనుల్లో ధోనీని ప్రత్యేకంగా నిలిపింది. ప్రణాళికలను రచించడంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. కొద్దికాలం ధోనితో కలిసి పనిచేశా. టాలెంట్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఫ్యాషన్తో ఆటను ఆడిన వ్యక్తి ధోనీ’’ అని ఛాపెల్ పేర్కొన్నాడు.
‘‘అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు ఆటకు సంబంధించిన సహజత్వాన్ని కోల్పోతున్నాయి. టాప్ ప్లేయర్ల క్రికెట్ను చూస్తూ యువకులు ఆటను నేర్చుకోవడం, స్నేహితులతో కలిసి ఆడటం వంటి పరిస్థితులు క్రమంగా దెబ్బతింటున్నాయి. భారత్ వంటి ఉపఖండ దేశంలో ఇప్పటికీ చాలా పట్టణాల్లో కోచింగ్కు సంబంధించి సౌకర్యాలు పెద్దగా లేవు. చాలా మంది యువకులు ఎలాంటి కోచ్ సాయం లేకుండా బయటి ప్రదేశాల్లో ఆడేస్తుంటారు. టీమ్ఇండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఇలా ఆడి నేర్చుకున్నవారే. వారిలో ముఖ్యంగా రాంచీ పట్టణం నుంచి వచ్చిన ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుకోవాలి. అంతర్జాతీయంగా నేర్చుకునే దశలో వివిధ పిచ్ల మీద అనుభవజ్ఞులతో కలిసి ఆడినప్పుడు తనకు తాను వృద్ధి చెందిన విధానం అద్భుతం. కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, స్ట్రాటజిక్ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడం వల్ల తన సమకాలీనుల్లో ధోనీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు’’ అని వివరించాడు. టీమ్ఇండియా తరఫున దాదాపు 15 ఏళ్లపాటు (2004-2019) ప్రాతినిధ్యం వహించిన ఎంఎస్ ధోనీ.. నాయకుడిగా టీ20 ప్రపంచకప్ (2007), వన్డే వరల్డ్కప్ (2011)ను భారత్కు అందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ