WPL: గుజరాత్ జెయింట్స్ బోణీ.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)కు హ్యాట్రిక్ ఓటమి. ఆర్సీబీపై గుజరాత్ జెయింట్స్ (GGW) 11 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్సీబీపై గుజరాత్ జెయింట్స్ (GGW) 11 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది బెంగళూరుకు హ్యాట్రిక్ ఓటమి. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (18) భారీ స్కోరు చేయలేకపోయినా.. సోఫీ డివైన్ (66; 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో రాణించింది. ఎల్లీస్ పెర్రీ (32; 25 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో హీథర్ నైట్ (30; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా జట్టును విజయాలతీరాలకు చేర్చలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్ గార్డ్నర్ మూడు, అన్నాబెల్ రెండు, మాన్సీ జోషి ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సోఫియా డంక్లీ (65; 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు), హర్లీన్ డియోల్ (67; 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించింది. ఆష్లీన్ గార్డ్నర్ (14), హేమలత (16), సథర్లాండ్ (14), స్నేహ్ రాణా (2), కీమ్ గార్త్ (3*), సుష్మా వర్మ (5*) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మేఘన్ స్కట్, రేణుకా తలో వికెట్ తీశారు.
డంక్లీ దంచెన్.. హర్లీన్ హరికేన్ !
గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఎల్లీస్ పెర్రీ వేసిన రెండో ఓవర్లో డంక్లీ, మేఘన చెరో ఫోర్ బాదారు. మేఘన్ స్కట్ వేసిన మూడో ఓవర్లో సోఫియా రెండు ఫోర్లు బాదింది. ఇదే ఓవర్లో మేఘన ఓ బౌండరీ కొట్టి చివరి బంతికి రీచాఘోష్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. మేఘన ఔటైన తర్వాత సోఫియా డంక్లీ దూకుడు పెంచింది. రేణుకా సింగ్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదింది. ప్రీతి వేసిన తర్వాతి ఓవర్లో సోఫియా బౌండరీల మోత మోగించింది. వరుసగా 4,6,4,4,4 కొట్టి 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. శ్రేయాంక పాటిల్ వేసిన ఎనిమిదో ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది చివరి బంతికి హీథర్ నైట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. గార్డ్నర్ను హీథర్ నైట్ వెనక్కి పంపిన తర్వాత క్రీజులోకి వచ్చిన హేమలత దూకుడుగా ఆడింది. ప్రీతి వేసిన 15 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టింది. కానీ, తర్వాతి ఓవర్లోనే రేణుకా సింగ్కు చిక్కి పెవిలియన్ చేరింది. పెర్రీ వేసిన 17 ఓవర్లో హర్లీన్ డియోల్ వరుసగా మూడు ఫోర్లు బాదింది. ఈ క్రమంలోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. రేణుకా సింగ్ వేసిన 19 ఓవర్లో మొదటి బంతికి సథర్లాండ్, చివరి బంతికి స్నేహ్ రాణా ఔటయ్యారు. శ్రేయాంక వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతికి డియోల్ పెవిలియన్ చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు