WPL: కీలక మ్యాచ్లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్పై 3 వికెట్ల తేడాతో గెలుపు
గుజరాత్ జెయింట్స్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్కు చేరుకుంది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో కీలక మ్యాచ్లో యూపీ వారియర్స్ సత్తా చాటింది. గుజరాత్ జెయింట్స్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్రేస్ హ్యారిస్ (72; 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులకు తోడు తాహిలా మెక్గ్రాత్ (57; 38 బంతుల్లో 11 ఫోర్లు), అర్ధ శతకంతో రాణించడంతో ఈ లక్ష్యాన్ని యూపీ19.5 ఓవర్లలో 7వికెట్లను నష్టపోయి ఛేదించింది. దేవికా వైద్యా (7), అలీసా హీలే (12), కిరణ్ నవ్గిరె (4), దీప్తి శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్న సోఫీ ఎకిల్స్టోన్ (19) యూపీని గెలిపించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ రెండు, మోనికా పటేల్, ఆష్లీన్ గార్డ్నర్, తనుజా కన్వర్, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.
గుజరాత్ బ్యాటర్లలో హేమలత (57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఆష్లీన్ గార్డ్నర్ (60; 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకాలతో మెరిశారు. సోఫీ డంక్లీ (23), లారా వోల్వార్డ్ట్ (17) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ (4) నిరాశపర్చింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అంజలి శ్రావణి, ఎకిల్ స్టోన్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్