Hardik vs Krunal: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. అన్నదమ్ముల సవాల్!
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) ఇవాళ డబుల్ బొనాంజా ఉంది. అందులో భాగంగా జరిగే తొలి మ్యాచ్కు మరో ప్రత్యేకత ఉంది. సోదరులు ప్రత్యర్థులుగా బరిలోకి దిగి తొలిసారి ఆయా జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో (IPL) అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సోదరులుగా మాత్రం హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్కు హార్దిక్ నాయకత్వం వహిస్తుండగా.. తాజాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీతో కృనాల్ పాండ్య లఖ్నవూ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా (GT vs LSG) వీరి మధ్య పోరు ఎలా ఉండనుందోననే ఆసక్తిగా మారింది.
రాహుల్ లేకపోవడం లోటే కానీ..
రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ లేకపోవడం లఖ్నవూకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్లో లఖ్నవూ బ్యాటర్లు గొప్పగా రాణించలేకపోయారు. ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం వల్ల కనీసం ఒక్క పాయింట్తోనైనా సరిపెట్టుకోగలిగింది. ఇలాంటి సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్కు లఖ్నవూ అడ్డుకట్ట వేయాలంటే మరింత శ్రమించాలి. అప్పుడే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. కెప్టెన్సీ చేపట్టిన కృనాల్ పాండ్య (Krunal Pandya) మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. గత సీజన్లో రెండు సార్లు, ఈ సారి ఇప్పటి వరకు ఒక మ్యాచ్లో ఇరు జట్లూ తలపడ్డాయి. మూడింట్లోనూ గుజరాతే విజయం సాధించడం గమనార్హం. ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో లఖ్నవూ బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ వచ్చినప్పటికీ.. తుది జట్టులో మాత్రం డికాక్ వచ్చే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రాతో కూడిన స్పిన్ త్రయం గుజరాత్ బ్యాటర్లను అడ్డుకోగలిగితే లఖ్నవూ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
తిరుగులేని గుజరాత్.. కానీ
గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లేఆఫ్స్ రేసులో ముందుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకూ అదరగొట్టగలిగే ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు చేజేతులా ఓటములను చవిచూసింది. రాజస్థాన్పై రెచ్చిపోయిన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya).. అంతకుముందు దిల్లీపై మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. బౌలింగ్లో రషీద్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ, హార్దిక్ ప్రత్యర్థులను కట్టడి చేసేస్తున్నారు. అయితే, లఖ్నవూ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఫామ్లోనే ఉంది. ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడని క్వింటన్ డికాక్ పరుగుల దాహంతో ఉన్నాడు. ఇక కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్ అద్భుత ఫామ్తో పరుగులు చేస్తున్నారు. కృనాల్, దీపక్ హుడా కూడా డేంజరస్ బ్యాటర్లే. ఈ క్రమంలో లఖ్నవూ బ్యాటింగ్.. గుజరాత్ బౌలింగ్కు మధ్య మంచి పోరాటం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్లో బౌలర్లు ప్రభావం చూపుతారని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
జట్లు (అంచనా)
గుజరాత్: శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ
లఖ్నవూ: క్వింటన్ డికాక్, కేల్ మేయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
Suresh Raina: ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆకస్మికంగా వైదొలగడంపై సురేశ్ రైనా ఎట్టకేలకు స్పష్టతనిచ్చాడు. బంధువులు హత్యకు గురవడం వల్లే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని వెల్లడించాడు. -
అతడో ‘లెర్నింగ్ మెషిన్’.. గుకేశ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ విజయంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
ఇకనైనా బౌండరీ లైన్ల పరిధిని పెంచండి..: సునీల్ గావస్కర్
ఐపీఎల్ జరిగే కొద్దీ బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. బౌలర్లు చేష్టలుడిగి చూసేందుకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్
ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో.. ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
వారికి పార్టీలు ఎక్కువ.. అందుకే ఒక్క టైటిలూ లేదు: సురేశ్ రైనా
చెన్నై జట్టు విజయవంతంగా కొనసాగడంలో సురేశ్ రైనా కూడా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత ఆ జట్టు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెటర్ రైనానే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
కోల్కతాతో మ్యాచ్.. చర్చకు దారితీసిన కోహ్లీ ఔట్ వివాదం!
కోల్కతా నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకూ వచ్చిన బెంగళూరు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే, విరాట్ కోహ్లీ ఔట్ నిర్ణయంపై వివాదాస్పదమైంది. -
కోహ్లీ ఆగ్రహానికి కారణమదే.. రూల్ ప్రకారం వెళ్లక తప్పదు: డుప్లెసిస్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇంటిముఖం పట్టే తొలి జట్టుగా బెంగళూరు నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా ఆరో ఓటమితో ప్లే ఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే. -
యంగ్ ‘క్యాండిడేట్’గా గుకేశ్.. చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్
భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ మరో రికార్డు సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచాడు. -
బెంగళూరు ఓటమి నం.7
బ్యాటర్ కర్ణ్ శర్మ, బౌలర్ స్టార్క్. 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆర్సీబీ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదేశాడు కర్ణ్. 2 బంతుల్లో 3 చేస్తే చాలు బెంగళూరుదే విజయం. -
143.. అయినా కష్టంగా!
ఓవైపు కొన్ని జట్లు సిక్సర్ల మోత మోగించేస్తూ 250 పైచిలుకు స్కోర్లు నమోదు చేస్తున్న ఈ ఐపీఎల్లో ఆదివారం పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. -
కోహ్లీకి కోపమొచ్చింది
కోల్కతాతో మ్యాచ్లో కోహ్లీకి కోపమొచ్చింది. ఆడిన ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన అతను ఛేదనలో దూకుడు ప్రదర్శించాడు. -
ఆర్సీబీ ఇంటికే!
ఐపీఎల్- 17వ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవబోతున్నట్లే! 8 మ్యాచ్ల్లో ఓ విజయం, 7 ఓటములతో 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆ జట్టు.. పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. -
టైటిల్ దిశగా గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్ టైటిల్కు చేరువయ్యాడు. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. -
తిరుగులేని వెర్స్టాపెన్
ఫార్ములావన్ స్టార్ రేసర్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగుతున్న ఈ రెడ్బుల్ రేసర్ ఈ సీజన్లోనూ వరుస విజయాలు నమోదు చేస్తున్నాడు. -
ఒలింపిక్స్కు బల్రాజ్, అక్ష్దీప్, ప్రియాంక
ప్రపంచ ఆసియా ఓసియానియా ఒలింపిక్, పారాలింపిక్ అర్హత రెగెట్టా టోర్నీలో భారత రోయింగ్ ఆటగాడు బల్రాజ్ పన్వర్ సత్తాచాటాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్ 2000 మీటర్ల విభాగంలో బల్రాజ్ మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నాడు. -
పారాలింపిక్స్కు వెంకటనారాయణ
నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్కు అర్హత సాధించాడు. -
టెన్నిస్కు ముగురుజ వీడ్కోలు
రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ గార్బైన్ ముగురుజ (స్పెయిన్) టెన్నిస్కు వీడ్కోలు పలికింది. ‘‘రిటైర్ కావడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నా. -
సంక్షిప్త వార్తలు(5)
బిష్కెక్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్ కోసం మరోసారి ట్రయల్స్ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్ సమాఖ్య యోచిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా