RCB vs GT: శతకంతో గిల్ విధ్వంసం.. బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్కు ముంబయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెంగళూరు: విరాట్ కోహ్లీ శతకం వృథా అయింది. కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్(104*: 52 బంతుల్లో 8 సిక్స్లు, 5 ఫోర్లు) మెరుపు శతకం చేసి ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్నిందించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో 2 సిక్స్లు, 7 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, విజయ్కుమార్ వైశక్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. పార్నెల్ 3.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101*) సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్తో ఈ సీజన్ లీగ్ దశ ముగిసింది. సెంచరీతో చెలరేగిన గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.
గిల్ విశ్వరూపం.. రాణించిన శంకర్
198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 25 పరుగుల వద్ద సాహా రూపంలో తొలివికెట్ కోల్పోయింది. అయితే తొలి వికెట్ తీసిన ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు నిలవలేదు. విజయ్ శంకర్తో జట్టు కట్టిన శుభ్మన్ గిల్ వీరవిహారం చేశాడు. రెండో ఓవర్ నుంచే ఫోర్లతో విరుచుకుపడిన గిల్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 51 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన గిల్ విధ్వంసం సృష్టించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా సిక్స్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 90 పరుగులు చేసింది. మరోవైపు మెళ్లిగా పుంజుకున్న విజయ్ శంకర్ సైతం ఫోర్లు, సిక్స్లతో మెరిపించాడు. ఈక్రమంలో గిల్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. అర్ధసెంచరీ అనంతరం మరింతగా చెలరేగిన గిల్ 13వ ఓవర్ వేసిన బ్రేస్వెల్కు చుక్కలు చూపాడు. రెండు సిక్స్లతో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు.
15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్తో అర్ధసెంచరీ చేసి మంచి ఊపుమీదున్న విజయ్ శంకర్ను విజయ్కుమార్ ఔట్ చేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన శనక డౌకౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్(6) సైతం వెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భావించారు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరం. అయితే ఒత్తిడిని చిత్తుచేస్తూ గిల్ 18వ ఓవర్లో రెండు సిక్స్లతో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. దీంతో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 19వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 8 పరుగులుగా మారింది. 20వ ఓవర్లో తొలి బంతి నోబాల్ కాగా, మరుసటి వైడ్ అయింది. మరోవైపు 98 పరుగులతో సెంచరీకి చేరువైన గిల్ సిక్స్ కొట్టి సెంచరీ చేయడంతో పాటు ఇన్నింగ్స్ను ముగించాడు.
విరాట్ విధ్వంసం..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డుప్లెసిస్(28: 19 బంతుల్లో) కలిసి బరిలోకి దిగిన కోహ్లీ(101*: 61 బంతుల్లో ఒక సిక్స్, 13 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో మంచి భాగస్వామ్యం లభించింది. తొలి వికెట్ వీరు 67 పరుగులు చేశారు. ఈ క్రమంలో 7.1 ఓవర్ల వద్ద డుప్లెసిస్ ఔట్ కావడంతో మాక్స్వెల్(11) క్రీజులోకి వచ్చాడు. అయితే 80 పరుగుల వద్ద మాక్స్వెల్, 85 పరుగుల వద్ద లామ్రోర్(1) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ ఒకింత నెమ్మదించింది. అయితే బ్రేస్వెల్(26: 16 బంతుల్లో 5 ఫోర్లు)తో జట్టు కట్టిన కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం చేశాడు. మరోవైపు దూకుడుగా ఆడే క్రమంలో బ్రేస్వెల్ 14వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటికీ ఆర్సీబీ స్కోర్ 132. ఆతర్వాత వచ్చిన కార్తిక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనుజ్ రావత్(23*: 15 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్)తో ఇన్నింగ్స్ నిర్మించిన కోహ్లీ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిన ఆర్సీబీ.. మిగతా ఐదు ఓవర్లలో 61 పరుగులు చేసింది. కోహ్లీ ఎడాపెడా ఫోర్లు బాదాడు. మరోవైపు అనుజ్ సైతం దాటిగా ఆడడంతో గుజరాత్కు బెంగళూరు భారీ స్కోర్ను లక్ష్యంగా నిర్దేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?