ప్లాన్లేమీ లేవ్..బయటికొచ్చి బాదడమే: శార్దూల్
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. అంతకుముందు వరకు బౌలర్గానే అతడిపై అందరికీ అంచనాలు ఉన్నాయి. కానీ తొలి ఇన్నింగ్స్లో 188/6 స్కోరుతో జట్టు కష్టాల్లో....
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. అంతకుముందు వరకు బౌలర్గానే అతడిపై అందరికీ అంచనాలు ఉన్నాయి. కానీ తొలి ఇన్నింగ్స్లో 188/6 స్కోరుతో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సుందర్తో కలిసి గొప్పగా ఆదుకున్నాడు. ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకం సాధించాడు. అంతేగాక అతడు ఆడిన షాట్లు, ఫుట్వర్క్ను క్రికెటర్లు, మాజీలు కొనియాడారు. పేసర్ కమిన్స్ బౌలింగ్లో హుక్షాట్తో సిక్సర్ బాది పరుగుల ఖాతా తెరవడం, స్పిన్నర్ లైయన్ బౌలింగ్లో లాఫ్టెడ్ షాట్తో మరో సిక్సర్తో హాఫ్సెంచరీ అందుకోవడం హైలైట్.
అయితే సిక్సర్ల కోసం ముందే ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేదని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. ‘‘లైయన్ బౌలింగ్లో ఎన్నో బంతులు డిఫెండ్ చేశా. అతడు కొన్ని ఫ్లైటెడ్ డెలివరీలు విసురుతున్నాడు. అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫ్లాట్గా, నాకు దూరంగా సంధిస్తున్నాడు. దీంతో పరుగులు సాధించలేకపోయా. అంతేగాక లెగ్సైడ్లో బౌండరీ లైన్లో ముగ్గురు ఫీల్డర్లను మొహరించాడు. దీంతో భారీ షాట్లు ఆడటానికి సంకోచించా’’ అని పేర్కొన్నాడు.
‘‘కానీ నా ఫుట్వర్క్ను మారుస్తూ ఆడాను. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ఫుట్తో బంతులు ఎదుర్కొన్నాను. దీంతో అతడి బౌలింగ్ను అర్థం చేసుకున్నాను. ఇక సిక్సర్ విషయానికొస్తే...దాని కోసం ఎలాంటి ప్లాన్ చేయలేదు. బంతి వేస్తున్నప్పుడు క్రీజు నుంచి బయటకి వచ్చి భారీషాట్ ఆడానంతే. అంతకుముందు అలాంటి బంతుల్ని ఎదుర్కొన్నా. దీంతో భారీషాట్ ఆడటానికి ఇదే సరైన సమయమని భావించా. అది స్టాండ్స్లోకి వెళ్లింది. అర్ధశతకం పూరైంది’’ అని అన్నాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ అర్ధశతకంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి
అతడిపై అంచనాలు వద్దు..ఒత్తిడి పెంచొద్దు: గంభీర్
ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.