క్రీజుకే అతుక్కుపోయిన విహారి, అశ్విన్‌

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(15), రవిచంద్రన్‌ అశ్విన్‌(33) పట్టుదలతో ఆడుతున్నారు...

Updated : 11 Jan 2021 12:22 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(15), రవిచంద్రన్‌ అశ్విన్‌(33) పట్టుదలతో ఆడుతున్నారు. వీరిద్దరూ క్రీజుకు అతుక్కుపోయి బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఎలాగైనా ఈ టెస్టును డ్రా చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. వారిద్దరూ ఇప్పటివరకు 234 బంతులాడి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్‌ 272 వద్ద పుజారా(77) ఐదో వికెట్‌గా వెనుదిరిగాక విహారి, అశ్విన్‌ జోడీ కట్టారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ 127 ఓవర్లకు 320/5తో నిలిచింది.

ఇవీ చదవండి..

షోయబ్‌ మాలిక్‌కు తప్పిన ప్రమాదం

క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని