ఆస్పత్రిలో బెడ్ దొరకడం కష్టమని ఊహించలేదు
ఆస్పత్రిలో పడక దొరక్కపోవడం అనేది ఎప్పుడూ ఊహించలేదని టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి అన్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న అతడు తన స్నేహితులు...
కరోనా సెకండ్ వేవ్పై హనుమ విహారి..
ఇంటర్నెట్డెస్క్: ఆస్పత్రిలో పడక దొరక్కపోవడం అనేది ఎప్పుడూ ఊహించలేదని టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి అన్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న అతడు తన స్నేహితులు, తెలిసిన వ్యక్తుల ద్వారా అనేక మంది కొవిడ్ బాధితులకు సహాయం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఎవరు ఏ సహాయం కావాలని విన్నవించినా తన బృందంతో కలిసి ఈ ఆంధ్రా క్రికెటర్ తనవంతుగా సేవ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..
‘నేను ప్రచారం కోసం ఈ పని చేయదల్చుకోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నా లక్ష్యం ఏమిటంటే.. ఎవరైతే ప్లాస్మా సర్దుబాటు చేసుకోలేరో వారికది అందించడం, ఆస్పత్రుల్లో పడకలు ఏర్పాటు చేయడం, మందులు కొనలేని వారికి సాయం చేయడం. ఈ కరోనా సెంకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో పడకలు దొరకడం చాలా కష్టంగా ఉంది. వీటి గురించి ఆలోచించాలి. అందువల్లే నా వాలంటీర్లతో కలిసి ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. కానీ, ఇప్పుడు చేస్తున్నది సరిపోదు. భవిష్యత్లో మరింత ఎక్కువ సేవ చేయాలని ఉంది’ అని విహారి అన్నాడు.
‘అందుకోసం నా సొంత టీమ్ను ఏర్పాటు చేసుకున్నా. అందరూ మంచిపని చేయడంతో ఇతరులు కూడా స్ఫూర్తి పొంది తమవంతుగా ముందుకు వచ్చారు. అలా మొత్తం 100 మంది వాలంటీర్లతో ఒక వాట్సాప్ బృందాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ల కష్టంతోనే కొంత మందికి సాయం చేయగలిగా. తొలుత నేను ఒక్కడిగా ప్రారంభించా. తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా అనేక మంది స్నేహితులు ముందుకొచ్చారు. సాయం కోసం నాకు వచ్చే అభ్యర్థనలను వారికి చేరవేస్తా. క్షేత్రస్థాయిలో వారిని కనుగొని వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తారు. ఏదైనా అత్యవసరమైతే నేను సామాజిక మాధ్యమాల ద్వారా చొరవ తీసుకొని సాయం కోసం కోరతా. ఇందులో నా భార్య, సోదరితో పాటు కొంతమంది ఆంధ్రా క్రికెట్ టీమ్ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. వాళ్ల మద్దతు కూడా లభించడం చాలా ఆనందంగా ఉంది’ అని విహారి వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ