కేంద్ర మంత్రికి షాకిచ్చిన హనుమ విహారి
తనను అవమానిస్తూ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
ఇంటర్నెట్ డెస్క్: తనను అవమానిస్తూ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు టీమ్ఇండియా క్రికెటర్ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమవిహారి ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న జట్టును ఓటమి పాలవ్వకుండా ఉండేందుకు అశ్విన్తో కలిసి 259 బంతుల్ని డిఫెండ్ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడు పోరాడిన తీరుకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా ట్వీట్ చేశారు.
‘7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమ్ఇండియా చారిత్రక విజయాన్ని హనుమబిహారి చంపేయడమే కాదు క్రికెట్ను హత్య చేశాడు. గెలుపు అవకాశాలు నిలపలేని అతడు ఒక నేరస్థుడు. నోట్: క్రికెట్ గురించి నాకేమీ తెలియదని నాకు తెలుసు’ అంటూ జనవరి 11న సుప్రియో ట్వీట్ చేశాడు. విహారిని అవమానించడమే కాకుండా అతడి పేరును ‘బిహారి’ అని రాశాడు. దీనికి ఈ తెలుగు క్రికెటర్ అత్యంత హుందాగా.. చతురతతో స్పందించాడు. ‘హనుమ విహారి’ అని మంత్రికి బదులిచ్చాడు. దాంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చావని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఐపీఎల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.