శిఖర్.. వాటిని దాటేశాడు: సన్నీ
టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్లోకి రావడం సంతోషకరమని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు....
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్లోకి రావడం సంతోషకరమని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో అతడు ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ మ్యాచులో గబ్బర్ 98 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
‘అవును, శిఖర్ వయసుపై చాలా చర్చ జరిగింది. అతనికిప్పుడు 35 ఏళ్లు. డిసెంబర్లో 36వ వసంతంలోకి అడుగుపెడతాడు. మరి 2023లో జరిగే వన్డే ప్రపంచకప్కు అతడు ఉంటాడా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి అతడు తన ఆటపై దృష్టిపెట్టడం, పరుగులు చేయడం సంతోషకరం’ అని సన్నీ అన్నారు. ‘రోహిత్శర్మతో కలిసి ధావన్ విధ్వంసకరమైన భాగస్వామ్యాలు ఇచ్చాడు. జట్టుకు ఎన్నోసార్లు మేలు చేశాడు’ అని ప్రశంసించారు.
క్రీజులో ఎక్కువ సమయం గడపడం, బంతిని చక్కగా మిడిల్ చేయడంతో ధావన్ ఆత్మవిశ్వాసం పెరిగిందని గావస్కర్ అన్నారు. మ్యాచులో అతడు 11 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడని పేర్కొన్నారు. ‘రోహిత్ సాధారణంగా ఆడేంత బాగా ఈ సారి ఆడలేకపోయాడు. అందుకే శిఖర్ ధావన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు. కొన్ని షాట్లను మిడిల్ చేశాక అతడిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఆ తర్వాత తన సామర్థ్యం మేరకు షాట్లు బాదేశాడు. మొయిన్ అలీ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్ అద్భుతం. శ్రమించే, కెప్టెన్ కోహ్లీ అన్నట్టు జట్టు మనిషైన ధావన్ విజయవంతం కావడం సంతోషకరం’ అని సన్నీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు