Harbhajan Singh: ఈసారి కప్పు బెంగళూరుదే.. గట్టి నమ్మకం: భజ్జీ

ఈసారి 15వ సీజన్‌లో బెంగళూరు టీమ్‌ విజేతగా నిలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారని టీమ్‌ఇండియా...

Published : 27 May 2022 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 మెగాటోర్నీ 15వ సీజన్‌లో ఈసారి బెంగళూరు టీమ్‌ విజేతగా నిలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఆ జట్టు ఫైనల్లో గుజరాత్‌తో తలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన భజ్జీ బెంగళూరు జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఈసారి బెంగళూరు జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్‌ లైనప్‌, బౌలింగ్‌ లైనప్‌ చూసినా ట్రోఫీ అందించే ఆటగాళ్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈరోజు జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చలాయిస్తుందనే నమ్మకం ఉంది. అదే జరిగితే ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఈసారి కచ్చితంగా ట్రోఫీ అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాజస్థాన్‌ను ఓడించాలంటే ఆ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవాలి. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి విజయం సాధించాలి. ఆటగాళ్లంతా సమష్టిగా రాణించాలి. ఈ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను కూడా ఇంకో సాధారణ మ్యాచ్‌లా తీసుకొని ఆడాలి. ఒత్తిడికి గురవ్వద్దు. ప్లేఆఫ్స్‌ కోసం బెంగళూరు చాలా కష్టపడింది. అలాంటి జట్టును ఇకపై ఓడించడం కష్టం’ అని హర్భజన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని