CSK: అత్యుత్తమ ఆల్రౌండర్.. ఈ స్టార్కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఐపీఎల్ 16వ సీజన్ (IPL 2023) ప్రారంభం కానుంది. ఇరు జట్లూ ఆల్రౌండర్లతో నిండిపోవడంతో మాంచి క్రికెట్ మజా మాత్రం అభిమానులకు ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) చరిత్రలో నాలుగు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మరోసారి విజేతగా నిలవడానికి సమాయత్తమైంది. ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో (GT vs CSK) చెన్నై తొలి మ్యాచ్లో తలపడనుంది. అంతర్జాతీయంగా టాప్ ఆల్రౌండర్లు సీఎస్కే (CSK) ఫ్రాంచైజీ సొంతం. రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, మొయిన్ అలీతోపాటు యువ ఆటగాడు శివమ్ దూబే, దీపక్ చాహర్ కూడా ఇటు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించగల సమర్థులు కావడం సీఎస్కేకు సానుకూలాంశం. అయితే వీరందరిలోకి ఎవరు బెస్ట్ అంటే అందుకు తాను సమాధానం చెబుతానని అంటున్నాడు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ అద్భుతమైన ఆల్రౌండర్లని.. అయితే వీరిద్దరితో పోలిస్తే రవీంద్ర జడేజా ప్రత్యేకమైన ఆటగాడిగా భజ్జీ అభివర్ణించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్వన్ ఆల్రౌండర్ జడేజానేనని పేర్కొన్నాడు.
ఓ క్రీడా ఛానెల్తో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ జడేజాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ సీజన్లో నా దృష్టంతా రవీంద్ర జడేజా ప్రదర్శనపైనే ఉంది. సీఎస్కే కోసం ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తాడనేది ఆత్రుతగా ఉంది. ఈ సీజన్లో జడ్డూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొస్తాడని అనిపిస్తోంది. తన నాలుగు ఓవర్ల కోటా కీలకమవుతుంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో జడేజా కంటే అత్యుత్తమ ఆల్రౌండర్ మరొకరు లేరు. అందుకే, ఐపీఎల్లో అతడి ప్రదర్శనను చూసేందుకు ఉత్సాహంతో ఉన్నా’’ అని హర్భజన్ సింగ్ తెలిపాడు.
గుజరాత్ టైటాన్స్కు తమ బ్యాటింగ్ విభాగం అనుకూలంగా ఉండటం గతేడాది కలిసొచ్చిందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇతర జట్ల కంటే అద్భుతంగా రాణించడానికి ప్రధాన కారణం కూడా అదేనని చెప్పాడు. ‘‘గతేడాది ఛాంపియన్గా నిలవడానికి గుజరాత్కు తమ బ్యాటింగ్ విభాగంలో ఉన్న నాణ్యతే కారణమైంది. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చాడు. కీలకమైన పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. జాంటీ రోడ్స్ చెప్పినట్లు ‘ఆహ్లాదకరంగా ఉండే జట్టు విజయం సాధిస్తుంది’.. గుజరాత్కు సరిగ్గా సరిపోయింది. కోచ్ ఆశిశ్ నెహ్రాతోపాటు జట్టు మేనేజ్మెంట్ మద్దతుగా నిలిచింది’’ అని భజ్జీ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM