Team India: టెస్టు కెప్టెన్గా రోహిత్.. కాదంటేబుమ్రా : హర్భజన్
టీమ్ఇండియా టెస్టు సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓటమిపాలయ్యాక విరాట్ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టెస్టు సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓటమిపాలయ్యాక విరాట్ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. అంతకుముందే అతడు టీ20, వన్డేల కెప్టెన్గానూ వైదొలిగాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ శర్మపైనే పడింది. మూడు ఫార్మాట్లలో అతడే జట్టును నడిపించాలని అటు అభిమానులు, ఇటు మాజీలు భావిస్తున్నారు. కానీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రోహిత్ పేరునే తన తొలి అభిప్రాయంగా వెల్లడించాడు. అతడు కాదంటే పేస్ గుర్రం జస్ప్రిత్ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నాడు. ‘రోహితే మూడు ఫార్మాట్లలో నాయకత్వం వహించాలని నేను ఆశిస్తున్నాను. అది కూడా అతడు ఫిట్గా ఉంటేనే. ఒకవేళ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి అతడు సానుకూలంగా లేకపోతే.. టెస్టు క్రికెట్ బాధ్యతల్ని బుమ్రాకు అప్పగించాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు చాలా సానుకూలంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు కపిల్ దేవ్ కూడా కెప్టెన్సీ చేశాడు. ఆయన కూడా బౌలరే. అలాంటప్పుడు ఇప్పుడెందుకు బౌలర్లు కెప్టెన్సీ చేపట్టొద్దు..? టీమ్ఇండియా మ్యాచ్ విన్నర్లలో బుమ్రా కీలక వ్యక్తి. అతడెన్నో విజయాలు అందించాడు. కాబట్టి, రోహిత్ ఒప్పుకోకపోతే బుమ్రా పేరును పరిశీలించాలి’ అని మాజీ స్పిన్నర్ తన ఆలోచనలు పంచుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!