WTC Final: ఈ ముగ్గురూ లేరెందుకు?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మొదలైన నాటి నుంచి టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. న్యూజిలాండ్లో మినహా ఎక్కడా సిరీస్ కోల్పోలేదు. దాంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్గా ఎదిగా సగర్వంగా ఫైనల్కు అర్హత సాధించింది...
చోటు దక్కని హార్దిక్, పృథ్వీ, భువి..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మొదలైన నాటి నుంచి టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. న్యూజిలాండ్లో మినహా ఎక్కడా సిరీస్ కోల్పోలేదు. దాంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్గా ఎదిగా సగర్వంగా ఫైనల్కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా అదే కివీస్ జట్టుతో తుదిపోరులో తలపడనుంది. అయితే, ఇంత ముఖ్యమైన మ్యాచ్కు టీమ్ఇండియా శుక్రవారం 24 మందితో కూడిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. అందులో హార్దిక్ పాండ్య, పృథ్వీషా, భువనేశ్వర్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లకు చోటుదక్కలేదు. మరి ఈ ముగ్గుర్నీ బీసీసీఐ ఎందుకు పక్కనపెట్టిందో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నో బౌలింగ్.. నో హార్దిక్..
హార్దిక్ పాండ్య 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాంతో అప్పటి నుంచీ అతడు బౌలింగ్కు దూరమయ్యాడు. తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్లో బ్యాటింగ్లో సత్తా చాటిన పాండ్య లాక్డౌన్ తర్వాత ఐపీఎల్లో ఆడాడు. కానీ అక్కడ బౌలింగ్ చేయలేకపోయాడు. ఆపై ఆస్ట్రేలియా పర్యటనలోనూ హార్దిక్ ఒక మ్యాచ్లో మినహా ఎక్కడా బంతి అందుకోలేదు. ఇక ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీసుల్లోనూ చాలా తక్కువ ఓవర్లే బౌలింగ్ చేశాడు. తర్వాత ఐపీఎల్ 14వ సీజన్లోనూ రోహిత్ బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ గమనిస్తే పాండ్య బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేడని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు టెస్టుల్లో అతడు ఏమంత మెరుగైన బ్యాట్స్మన్ కాదు. ఈ రెండు కోణాల్లో ఆలోచించే బీసీసీఐ అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చిందని తెలుస్తోంది.
ఫామ్లో ఉన్నా..
పృథ్వీషా గతేడాది న్యూజిలాండ్, ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో 0, 4 పరుగులు చేసిన అతడు తర్వాత టీమ్ఇండియాలో చోటు కోల్పోయాడు. అనంతరం భారత్కు తిరిగొచ్చాక ఎక్కడ విఫలమవుతున్నాననే విషయంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రె వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు. ఆ సమయంలో కాలి కదలికలను, బ్యాటింగ్ చేసే టైమింగ్ను మెరుగుపర్చుకున్నాడు. దాంతో ఐపీఎల్కు ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రెచ్చిపోయాడు. ఒకే సీజన్లో 800పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అలా తన సమస్యను అధిగమించిన పృథ్వీ ఇటీవల ఐపీఎల్లోనూ చెలరేగిపోయాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పుడతడు మంచి ఫామ్లో ఉన్నా బీసీసీ ఎందుకు ఎంపిక చేయలేదో తెలియరాలేదు.
గాయాలే భువి పాలిట శాపం..
ఇక భువనేశ్వర్ కుమార్ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం గాయాలనే చెప్పొచ్చు. 2018 జనవరిలో చివరిసారి దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడిన అతడు తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్లో ఆడలేదు. దాంతో టెస్టు క్రికెట్ ఆడక ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచాయి. అప్పుడతడు గాయం బారిన పడి చాలా కాలం టీమ్ఇండియాకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో ఆడి మళ్లీ గాయపడ్డాడు. అప్పుడు నాలుగు మ్యాచ్ల్లో మూడు వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఐదు టీ20ల్లో నాలుగు వికెట్లు, మూడు వన్డేల్లో ఆరు వికెట్లు తీశాడు. అయితే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 14వ సీజన్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో 9.10 ఎకానమీతో మూడు వికెట్లే తీశాడు. దాంతో భువి పూర్తిస్థాయిలో సిద్ధంగా లేడని బీసీసీఐ భావించినట్లు అనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఐసీసీ ఏ జట్టుకైనా ఎక్కువ మంది ఆటగాళ్లను ఎంపిక చేసే వీలు కల్పించింది. అయినా ఈ ముగ్గుర్నీ ఎంపిక చేయకపోవడం గమనార్హం.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు