Hardik pandya: ఎవరేమనుకున్నా పట్టించుకోను.. సంజూ వివాదంపై హార్దిక్ పాండ్యా కౌంటర్
న్యూజిలాండ్తో టీ20 తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు లేకపోవడంపై వస్తోన్న విమర్శలకు హార్దిక్ పాండ్యా స్పందించాడు.
దిల్లీ: న్యూజిలాండ్తో టీ20 మ్యాచుల్లో తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను తీసుకోకపోవడంపై పలువురు టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పొట్టి సిరీస్లో ఆటగాళ్లను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు. ఇలాంటి విమర్శలు తనను బాధించవన్నాడు.
‘ఇది నా జట్టు. జట్టుకు సరిపోయే ఆటగాళ్లను కోచ్తో కలిసి నేను ఎంపికచేసుకుంటాను. ఇంకా చాలా సమయం ఉంది. ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. ఒకసారి జట్టులోకి వస్తే వారు ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. ఇక దీని గురించి బయట నుంచి వచ్చే విమర్శలను నేను పట్టించుకోను. ఒకవేళ ఇది ఎక్కు వ మ్యాచ్లు ఆడే సుదీర్ఘ సిరీస్ అయితే.. కచ్చితంగా అందరినీ ఆడిస్తాం. అంతేకానీ జట్టును మధ్యలో విభజించి మార్పులు చేయడం సరైందని నేను నమ్మను. భవిష్యత్తులో కూడా నా పద్ధతి ఇలాగే ఉంటుంది’’ అంటూ హార్దిక్ వివరించాడు. అదే సమయంలో సంజూ శాంసన్ అంశంపైకూడా స్పందించాడు.
‘‘ఉదాహరణకు సంజూనే తీసుకోండి.. మేం అతడిని జట్టులోకి తీసుకోవాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. నేను వారి స్థానంలో ఉండి ఆలోచించగలను. టీమ్ఇండియాలో కొనసాగుతూ 11 మంది ఆటగాళ్లలో ఒకరిగా లేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. కానీ నేను కెప్టెన్గా ఉంటే మాత్రం ఆ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను. వారు నాతో, కోచ్తో మాట్లాడితే నేను వారికి సర్దిచెప్పగలను. ఎందుకంటే నాది జట్టును కలిసికట్టుగా ఉంచగలిగే స్వభావం’’ అంటూ పాండ్యా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు