Hardik Pandya: 10 పరుగులు తక్కువ చేశాం.. హైదరాబాద్తో ఓటమిపై పాండ్య
టీ20 లీగ్లో భాగంగా గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగులు తక్కువ చేశామని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు...
(Photo: Hardik Pandya Instagram)
ముంబయి: టీ20 లీగ్లో భాగంగా గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగులు తక్కువ చేశామని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పాండ్య (50 నాటౌట్; 42 బంతుల్లో 4x4, 1x6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ 19.1 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది.
‘బ్యాటింగ్లో మేం సుమారు 10 పరుగులు తక్కువ చేశామనుకుంటా. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవి. తొలుత మేం బంతితో బాగా ఆరంభించినా రెండు ఓవర్లలో వాళ్లు సాధించిన 30 పరుగులతోనే తిరిగి పోటీలోకి వచ్చారు. హైదరాబాద్ టీమ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. వాళ్ల ప్రణాళికలను కచ్చితంగా అమలు చేశారు. వాళ్ల బౌలింగ్ విధానానికి క్రెడిట్ దక్కుతుంది. తప్పుల నుంచి మేం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి గురించి మేమంతా కూర్చొని చర్చించుకొని ముందుకు సాగుతాం’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
(Photo: Kane Williamson Instagram)
ఇక హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యం మోస్తరు స్కోరేనని చెప్పాడు. ‘వాళ్లకు మేటి బౌలింగ్ దళం ఉంది. దీంతో మేం సరైన భాగస్వామ్యాలు నిర్మించాలనుకున్నాం. అదే పని చేశాం. మా ఆటగాళ్లు ఎవరేం చేయాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు. ఈ మ్యాచ్లో పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, మేం వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాం. బౌండరీలు సాధించడం కష్టంగా అనిపించినా చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. మొత్తానికి ఈరోజు మా కుర్రాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఇక రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి రాహుల్ త్రిపాఠి త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు