IND vs SL: ఏ ఫార్మాటైనా నోబాల్స్ వేయడం క్రైమే.. : హార్దిక్ పాండ్య
అర్ష్దీప్ సింగ్ నోబాల్స్పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) స్పందించాడు. ఆట ప్రాథమిక సూత్రాలను పక్కన పెట్టడం నేరం అంటూ వ్యాఖ్యానించాడు.
పుణె: శ్రీలంకతో రెండో టీ20(IND vs SL 2023)లో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ వేసిన నో బాల్స్పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఈ మ్యాచ్లో 16 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక సిరీస్ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. అయితే, అర్ష్దీప్ వేసిన రెండు ఓవర్లలో మొత్తం 5 నోబాల్స్ వేసి.. 23 అదనపు పరుగులను సమర్పించాడు. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమికి ఈ నోబాల్స్ కూడా ఓ కారణమే అంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫార్మాట్ ఏదైనా నోబాల్స్ వేయడం క్రైమ్ అంటూ పేర్కొన్నాడు. తాను అర్ష్దీప్ను తప్పుపట్టడం లేదని.. కానీ, ఈ యువ పేసర్ తన తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
‘‘అన్ని రోజులూ గొప్పగా ఆడటం సాధ్యం కాదు. కొన్ని చెడ్డ రోజులూ ఉంటాయి. అలాగని ఆట ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. గతంలోనూ అర్ష్దీప్(Arshdeep Singh) ఇలాగే నోబాల్స్ వేశాడు. ఇలా అయితే చాలా కష్టం. ఈ విషయంలో అతడిని నిందించాలని, కఠినంగా వ్యవహరించాలని అనుకోవడం లేదు. కానీ, ఏ ఫార్మాట్లో అయినా నోబాల్స్ వేయడం నేరమన్న విషయం తెలిసిందే కదా’’ అంటూ పాండ్య తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
మ్యాచ్లో ఓటమికి గల కారణాలపై మాట్లాడుతూ.. తాము పవర్ప్లేలో వైఫల్యం చెందామని అన్నాడు. ‘‘పవర్ప్లేలో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ గొప్పగా ఆడలేకపోయాం. అది మమ్మల్ని బాధించింది. కొన్ని చేయకూడని పొరపాట్లు సైతం చేశాం. అది అందరికీ తెలుసు. ఆటలో మనం నియంత్రించగలిగే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఆడాలని ఈ మ్యాచ్ వల్ల నేర్చుకున్నాం’’ అంటూ పాండ్య తెలిపాడు. అరంగేట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠిని నంబర్ 3లో బ్యాటింగ్ చేయించడానికి గల కారణాలను వివరిస్తూ.. ‘‘రాహుల్కు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటే. ఈ ఫార్మాట్లో ఇప్పుడే అడుగుపెడుతున్నాడు కాబట్టి కాస్త సౌకర్యంగా ఆడగల స్థానం ఇస్తే బాగుంటుందని భావించాం’’అని వివరించాడు.
ఇక శ్రీలంక కెప్టెన్ శానక మాట్లాడుతూ.. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ల భాగస్వామ్యంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘దాదాపు మ్యాచ్ మా చేజారిపోయిందని అనుకున్నాం. భారత బ్యాటర్ల నైపుణ్యం అలాంటిది. క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ఆటగాళ్లపై విజయం సాధించడం గొప్ప అనుభూతి’’ అంటూ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!