Dhoni - Haris Rauf: ధోనీని పట్టుబట్టి మరీ అదే అడిగా.. : పాకిస్థాన్ క్రికెటర్
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే అడిగానని, టీమ్ఇండియాది కాదని పాకిస్థాన్ ఆటగాడు హారిస్ రావుఫ్ తాజాగా వెల్లడించాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే అడిగానని, టీమ్ఇండియాది కాదని పాకిస్థాన్ ఆటగాడు హారిస్ రావూఫ్ తాజాగా వెల్లడించాడు. ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన సందర్భంగా అతడు ఈ వివరణ ఇచ్చాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్-పాక్ మ్యాచ్ అనంతరం హారిస్.. ధోనీని కలిసి కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలోనే ధోనీ ఆటోగ్రాఫ్తో కూడిన చెన్నై జెర్సీని తనకు ఒకటి బహుమతిగా ఇవ్వాలని కోరాడు. అందుకు సరే అని ఒప్పుకొన్న ధోనీ కొద్ది రోజుల తర్వాత హారిస్ ఆస్ట్రేలియాలో ఉండగా తన చెన్నై జెర్సీని బహుమతిగా పంపాడు. అదే విషయాన్ని రావూఫ్ వెల్లడించాడు. అయితే, తాను పట్టుబట్టి మరీ చెన్నై జెర్సీనే కావాలని, టీమ్ఇండియాది కాదని ధోనీతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
పాండ్య చెప్పిందే నిజమైంది..
అనంతరం టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యపై స్పందించిన హారిస్ రావూఫ్ మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు. టీమ్ఇండియా 2018-19 సీజన్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తాను నెట్ బౌలర్గా సేవలందించినట్లు చెప్పాడు. అప్పుడు పాండ్య చెప్పిన మాటలు తనకు భరోసా ఇచ్చాయని పేర్కొన్నాడు. ‘అప్పుడు టీమ్ఇండియా మేనేజర్కు నెట్ బౌలింగ్ చేసే బౌలర్లు అవసరమయ్యారు. దీంతో అంతర్జాతీయ క్రికెటర్లకు బౌలింగ్ చేయడం మంచి అవకాశమని భావించి భారత బ్యాట్స్మెన్కు నేను నెట్ బౌలర్లా సేవలందించా. ఆ సమయంలో పుజారా, కోహ్లీకి బౌలింగ్ చేశా. అప్పుడే నాతో పాటు బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య. నా బౌలింగ్ చూసి త్వరలోనే పాకిస్థాన్ జట్టుకు ఎంపికవుతానని చెప్పాడు. అది నాకు ఆత్మవిశ్వాసం పెంచింది’ అని రావూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు రాకముందు నాటి విషయాలను నెమరువేసుకున్నాడు. కాగా, 2020లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన హారిస్ రావుఫ్ గతేడాది టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య(11)ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని