T20 Challenge : ఉత్కంఠ పోరులో హర్మన్ జట్టు విజయం.. మూడో సారి టైటిల్ కైవసం
హర్మన్ ప్రీత్ జట్టుదే టీ20 ఛాలెంజ్ టైటిల్. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దీప్తి శర్మ జట్టును నాలుగు పరుగులు తేడాతో ఓడించి...
పుణె: టీ20 ఛాలెంజ్ టైటిల్ను హర్మన్ ప్రీత్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దీప్తి శర్మ జట్టును నాలుగు పరుగులు తేడాతో ఓడించి హర్మన్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ జట్టు 161/8 స్కోరుకే పరిమితమైంది. లారా వాల్వార్డ్ (65), సిమ్రన్ బహుదుర్ (20) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 15, యస్తిక భాటియా 13, కిరన్ నవ్గిరే డకౌట్, నాథకన్ ఛతామ్ 6, దీప్తి శర్మ 2, స్నేహ్ రాణా 15, కేట్ క్రాస్ 13 పరుగులు చేశారు. హర్మన్ టీమ్ బౌలర్లలో అలానా కింగ్ 3, సోఫీ 2, డాటిన్ 2, పూజ వస్త్రాకర్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ జట్టు మూడో సారి టైటిల్ను సొంతం చేసుకుంది. అంతకుముందు 2018, 2019 సంవత్సరాల్లోనూ టైటిల్ను గెలుచుకుంది.
ధాటిగా ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లు డాటిన్ (62), ప్రియా పునియా (28) తొలి వికెట్కు 73 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన హర్మన్ ప్రీత్ (43) కూడా ధాటిగా ఆడింది. అయితే మిగతా బ్యాటర్లు పూజా వస్త్రాకర్ (5), ఎక్లేస్టోన్ (2), సునె లూయిస్ (3), డియోల్ (7) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పరుగుల వేగం మందగించింది. దీప్తి శర్మ బౌలర్లలో కేట్ క్రాస్ 2, దీప్తి శర్మ 2, సిమ్రన్ 2, ఖాకా ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్