Harmanpreet Kaur: పాక్‌పై సూపర్‌ విక్టరీ.. ధోనీ రికార్డును అధిగమించిన హర్మన్‌ప్రీత్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాకిస్థాన్‌ మహిళల జట్టుపై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్ని రంగాల్లో ...

Published : 01 Aug 2022 02:01 IST

(ఫొటో సోర్స్‌: హర్మన్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాకిస్థాన్‌ మహిళల జట్టుపై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో సెమీస్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. బుధవారం బార్బోడస్‌పై గెలిస్తే సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. ఇదే సమయంలో భారత సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా టీ20 మ్యాచుల్లో విజయాలను నమోదు చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హర్మన్ అవతరించింది. ఈ క్రమంలో భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన మాజీ సారథి ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించడం విశేషం. 

ఇప్పటివరకు టీ20ల్లో 71 మ్యాచులకు హర్మన్‌ ప్రీత్‌ భారత జట్టు సారథిగా వ్యవహరించింది. ఇందులో 42 మ్యాచుల్లో విజయం సాధించగా.. 26 మ్యాచుల్లో భారత్‌ ఓడింది. మరో మూడింట్లో ఫలితం లేకపోయింది. అలాగే ఎంఎస్ ధోనీ టీమ్‌ఇండియాకు 72 మ్యాచుల్లో నాయకత్వం వహించాడు. టీమ్‌ఇండియా 41 మ్యాచుల్లో గెలిచి.. మరో 28 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌ టైగా ముగియగా.. మరో రెండింటి ఫలితం తేలలేదు. తాజాగా హర్మన్‌ ప్రీత్‌ పాక్‌పై విజయంతో ధోనీని అధిగమించి రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమ్‌ఇండియా 50 టీ20లను ఆడగా.. అందులో 30 మ్యాచుల్లో విజయం సాధించి 16 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు టైగా.. మరో రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని