Harmanpreet kaur: టీ20 చరిత్రలోనే హర్మన్ప్రీత్ అరుదైన రికార్డు
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet kaur) టీ20 చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ముంబయి: మహిళల క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet kaur) చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన మహిళా క్రికెటర్గా నిలిచింది. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ ఈ ఘనతను సాధించింది. ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్తో ఈ యువ కెప్టెన్ 140 టీ20లు పూర్తిచేసింది.
ఇందులో 125 ఇన్నింగ్స్ల్లో 27.36. సగటుతో 2,736 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో 103 ఉత్తమ స్కోరుతో మొత్తం 8 అర్ధ శతకాలు, 1 శతకాన్ని నమోదు చేసింది. హర్మన్ప్రీత్ తర్వాతి స్థానంలో 139 టీ20లు ఆడి న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్కు చెందిన డన్నీ వాట్(136) మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ అలీస్సా హేలీ(135), ఎలీస్ పెర్రీ(129) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్(INDW vs AUSW)లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. భారత్ను 21 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు ఓడించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై హర్మన్ప్రీత్ కౌర్ స్పందిస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంలో వైఫల్యం జట్టు ఓటమికి కారణమైందని తెలిపింది.
‘‘ఆసీస్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని మేం కచ్చితంగా ఛేదిస్తామనే అనుకున్నాం. కానీ, దాదాపు ఏడు ఓవర్లలో 6 పరుగుల కన్నా తక్కువ స్కోర్ చేయడం మా జట్టును దెబ్బతీసింది. బౌండరీ కొట్టిన అనంతరం డాట్ బాల్స్ను ఎదుర్కోవలసి వచ్చింది. స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన చోట చేయలేకపోవడం మరో ప్రతికూల అంశంగా మారింది. బౌండరీలు కొట్టే సమయంలో వికెట్లను కోల్పోవడం కూడా నష్టం చేకూర్చింది’’ అని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!