IND w Vs AUS w: ఆసీస్తో సెమీస్.. పూజా ఔట్.. హర్మన్ ఆడటంపై అనుమానాలు..!
మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup 2023)లో సెమీస్లో ఆసీస్తో తలపడేందుకు టీమ్ఇండియా (INDw Vs AUSw) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత్కు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్లో (Womens T20 World Cup 2023) టీమ్ఇండియా సెమీస్కు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో కీలకమైన పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో భారత్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ టీ20 ప్రపంచకప్ నుంచే వైదొలగగా.. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఆసీస్తో సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉంటుందో లేదోననే అనిశ్చితి కొనసాగుతోంది. హై ఫీవర్తో బాధపడిన హర్మన్ ఇవాళే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సమాచారం. ఆమె సెమీస్లో ఆడుతుందో.. లేదో అనేది తేలాలంటే బీసీసీఐ అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. శ్వాసకోస సంబంధిత సమస్యతో పూజా దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే, ఐర్లాండ్తో మ్యాచ్లో ఆడలేకపోయిన రాధా యాదవ్ కూడా సెమీస్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు వెల్లడించాయి. వీరు ముగ్గురూ బీసీసీఐ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నాయి.
‘‘పూజా వస్త్రాకర్కు బదులు స్నేహ్ రాణాను స్క్వాడ్లోకి తీసుకొనేందుకు భారత్కు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది’’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. గ్రూప్ - B నుంచి రెండోస్థానంలో భారత్ సెమీస్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు కీలకమైన మ్యాచ్కు ఆల్రౌండర్ను కోల్పోవడం టీమ్ఇండియాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హర్మన్ ఆడకపోతే ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న స్మృతీ మంధాన జట్టును నడిపిస్తుంది. బలమైన ఆసీస్ను ఢీకొట్టాలంటే శక్తియుక్తులన్నింటినీ భారత్ ప్రయోగించాల్సి ఉంటుంది. హర్మన్, పూజా లేకపోయినా.. స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తికా భాటియా వంటి టాప్ ప్లేయర్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.