SKY: సూర్యకుమార్ కంటే అతడే ఒక మెట్టు పైనుంటాడు: హర్షల్ పటేల్
ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఫామ్లేమి కొనసాగుతోంది. ఇటీవల ఆసీస్తో వన్డే సిరీస్లో విఫలమై విమర్శలపాలైన సూర్య.. ఆర్సీబీతో తొలి మ్యాచ్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్ యాదవ్.. గత ఆరు నెలల ముందు వరకు ఈ పేరు వింటే ప్రత్యర్థులకు హడల్. అంతర్జాతీయంగా టీ20ల్లో టాప్ ర్యాంకర్. అయితే, ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్ (IPL 2023) తొలి మ్యాచ్లోనూ విఫలమై నిరాశపరిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 16 బంతుల్లో 15 పరుగులే చేసి పెవిలియన్కు చేరాడు. కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ను అడ్డుకొనేందుకు తమ బౌలింగ్ యూనిట్ ప్రణాళికలను సిద్ధం చేసుకుందని, పక్కాగా అమలు చేసినట్లు తెలిపాడు.
‘‘ఇప్పుడు సూర్యకుమార్ ఎలాంటి ఫామ్లో ఉన్నప్పటికీ.. అతడి సత్తాను దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేసి అమలు చేయాలి. అతడే ఏం చేస్తాడనేది అతడి ఇష్టం. ఇలాంటి పరిస్థితులను ( 4 ఓవర్లలో 43 పరుగులు ఇవ్వడం) ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అయితే సూర్య కంటే ఒక అడుగు ముందుంటాడు. అతడు తనకు కావాల్సిన చోట బంతి పడేలా బౌలర్లను ప్రభావితం చేయగల సమర్థుడు. సూర్యకుమార్ మాత్రం పిచ్ వెలుపల ఆఫ్స్టంప్ వికెట్పై స్వీప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. తన శరీరం మీదకు బంతిని తీసుకొని ఆడటం కూడా సూర్యలో ఉన్న మరో క్వాలిటీ. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు’’ అని హర్షల్ తెలిపాడు. తిలక్ వర్మ (84) రాణించడంతో ముంబయి మంచి స్కోరు సాధించగలిగింది. కానీ, ఫాఫ్ డుప్లెసిస్ (73)తోపాటు విరాట్ కోహ్లీ (82*) అదరగొట్టడంతో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!