IND vs SA : వాండరర్స్ మైదానంలో వికెట్.. కుంబ్లే తర్వాత అశ్వినే.!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్ను ఔట్..
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్ను ఔట్ చేయడం ద్వారా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్ మైదానంలో వికెట్ తీసిన రెండో భారత స్పిన్నర్గా నిలిచాడు.
2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. వాండరర్స్లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే (2/2, 3/54) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్ఇండియా ఆ టెస్టులో 123 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. అప్పటి నుంచి టీమ్ఇండియా రెండు సార్లు (2013-14, 2017-18) దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. తాజా పర్యటనలో భాగంగా వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కీగన్ పీటర్సన్ను ఔట్ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్లో వికెట్ తీసిన భారత స్పిన్నర్గా అశ్విన్ అరుదైన ఫీట్ సాధించాడు.
ఇదిలా ఉండగా, వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా రద్దయ్యింది. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా 118/2 స్కోరుతో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం కెప్టెన్ డీన్ ఎల్గర్ (46), వాండర్ డస్సెన్ (11) క్రీజులో కొనసాగుతున్నారు. మరో వైపు, భారత్ ఈ టెస్టులో విజయం సాధించి సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించాలని చూస్తోంది.!
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు