T20 League : భీకర ఫామ్లో బట్లర్.. కోహ్లీ రికార్డును తుడిచేస్తాడా..?
పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాటింగ్ ఆధిపత్యమని తెలుసు కదా.. అయితే బౌలర్లూ...
ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ఫార్మాట్ అంటేనే బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. అయితే అన్ని వేళలా వర్తించదు. బౌలర్లూ కట్టుదిట్టమైన బంతులు సంధిస్తూ మంచి ప్రదర్శన చేస్తూ ఉంటారు. వారిని ఎదుర్కొని 120 బంతులు మాత్రమే ఉండే మ్యాచులో అర్ధశతకం సాధిస్తే గొప్ప.. అలాంటిది సెంచరీ కొడితే అబ్బో అనాల్సిందే.. ఇక ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేస్తే వారిని సూపర్ బ్యాటర్లుగానే పరిగణించాలి. ఇలాంటి ఫీట్ను ఈ సీజన్ టీ20 లీగ్లో బట్లర్ సాధించాడు. ఈ జాబితాలో ఇంకెవరెవరు సాధించారు.. టాప్లో ఏ బ్యాటర్ ఉన్నాడనే విషయాలను తెలుసుకుందాం..
ఒకే సీజన్లో నాలుగు శతకాలు
విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్న రోజులవి.. ఏ ఫార్మాటైనా సరే ‘రన్ మెషిన్’ పరుగులు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో భీకరమైన బౌలర్ ఉన్నా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు బెంగళూరు ఒక్క టీ20 లీగ్ కప్ను సొంతం చేసుకోకపోయినా వ్యక్తిగతంగా కోహ్లీ గొప్ప రాణించాడు. ఇప్పటికీ ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు కోహ్లీపై ఉందంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. 2016 సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 152.03 స్ట్రైక్రేట్తో నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలతో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. ఇక బ్యాటింగ్ సగటు చూస్తే 81.08. ఆ సీజన్లో విరాట్ అత్యధిక స్కోరు 113 పరుగులు.
ఈసారి బట్లర్ జోరు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్లో రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగిపోతున్నాడు. బంతిని బౌండరీకి తరలించడమే ఏకైక లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో బట్లర్ (375) టాప్లో ఉన్నాడు. అదే విధంగా సీజన్లో రెండు శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ కూడా బట్లరే. ముంబయిపై 100 (68 బంతుల్లో), కోల్కతాపై 103 (61 బంతుల్లో) పరుగులు బాదాడు. రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. అంతేకాకుండా గత 23 టీ20 ఇన్నింగ్స్లను పరిగణనలోకి తీసుకుంటే బట్లర్ నాలుగు సెంచరీలు చేయడం విశేషం. ఒకే సీజన్లో రెండు శతకాలు నమోదు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలోకి బట్లర్ చేరాడు. ఈ సీజన్లో రాజస్థాన్ ఇప్పటికి ఆరు మ్యాచులను మాత్రమే ఆడింది. ఇంకా లీగ్ దశలోనే ఎనిమిది మ్యాచ్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్కు చేరితే కనీసం ఇంకో మ్యాచ్ ఆడొచ్చు. మరి మిగతా మ్యాచుల్లోనూ మూడు శతకాలు చేస్తే కోహ్లీని దాటేసే అరుదైన అవకాశం బట్లర్కు ఉంది. ఇక ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలోనూ బట్లర్దే మొదటి స్థానం. ఇప్పటి వరకు 23 సిక్సర్లను బాదేశాడు.
గత సీజన్లో జోస్ ఎలా ఆడాడంటే..?
కరోనా కారణంగా రెండు దశల్లో జరిగిన గత సీజన్ టీ20 లీగ్లో రాజస్థాన్కే ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ ఏడు మ్యాచ్లను మాత్రమే ఆడాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో దశలో పాల్గొనలేదు. భారత్లో జరిగిన తొలి ఎడిషన్లో మాత్రం ఏడు మ్యాచుల్లో 254 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం (124) ఉంది. స్ట్రైక్రేట్ (153.01) బాగున్నా బ్యాటింగ్ సగటు 36.28 మాత్రమే ఉంది. అయితే ప్రస్తుత సీజన్లో భారీ సగటు (75)తో పరుగులు చేస్తున్నాడు. ఇదే విధంగా ఆడితే కోహ్లీ అత్యధిక పరుగులు (973) రికార్డుకు చేరువగా వచ్చే అవకాశం ఉంది.
వీరు కూడా రెండేసి..
క్రిస్ గేల్, హషీమ్ ఆమ్లా, షేన్ వాట్సన్, శిఖర్ ధావన్ కూడా ఒకే సీజన్లో రెండు శతకాలను నమోదు చేశారు. 2011 సీజన్లో బెంగళూరు తరఫున క్రిస్ గేల్ (608) 12 మ్యాచుల్లో రెండు సెంచరీలను నమోదు చేశాడు. ఒకే సీజన్లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన మొదటి బ్యాటర్గా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును కోహ్లీ (2016) నాలుగు శతకాలతో బద్దలు కొట్టాడు. ఇక 2017 సీజన్లో కోల్కతా బ్యాటర్ హషీమ్ ఆమ్లా (2), 2018లో చెన్నై తరఫున ఆడిన షేన్ వాట్సన్ (2), 2020లో దిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్ (2) మాత్రమే ఒకే సీజన్లో రెండు శతకాలు సాధించారు. ఆ తర్వాత ఇప్పుడు జోస్ బట్లర్.
బట్లర్ కాకుండా ఇంకెవరి ఛాన్స్ ఉందంటే..?
ప్రస్తుతం సీజన్లో రెండు శతకాలు చేసిన జోస్ బట్లర్కు కాకుండా గుజరాత్ సారథి కేఎల్ రాహుల్కూ అత్యధిక సెంచరీలు సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక శతకం చేసిన కేఎల్ రాహుల్ (235) టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ను చూస్తే బట్లర్కు పోటీ ఇవ్వగలడు. లఖ్నవూ కూడా ఇప్పటి వరకు ఆరు మ్యాచులను మాత్రమే ఆడింది. ప్లే ఆఫ్స్కు అవకాశం ఉన్న నేపథ్యంలో శతకాలు సాధించడం రాహుల్కు కష్టమేమీ కాదు. వీరిద్దరూ ఓపెనర్లు కావడం కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తుండటం వల్ల సెంచరీలు నమోదు చేసే అవకాశం దొరకడం లేదు. మంచి ఇన్నింగ్స్లను మాత్ర ఆడగలుగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM