IND vs ENG: హాకీ వరల్డ్ కప్లో డ్రాగా ముగిసిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్
చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. రెండో ఆట గెలిచి పూల్ డీలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న భారత్కు ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది.
భువనేశ్వర్: హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఆట డ్రాగా ముగిసింది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో ఆటలో విజయం సాధించి పూల్ డీలో టాపర్గా నిలవాలనుకున్న భారత్కు ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్లో గోల్ కొట్టే అవకాశాలను ఇరుజట్ల ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుకు అనేకమార్లు గోల్ వేసే అవకాశం లభించినప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండో అర్థభాగంలో భారత్ పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను తృటిలో చేజార్చుకుంది.
మూడో క్వార్టర్లో గోల్ చేసేందుకు భారత్ దూకుడుగా ఆడినప్పటికీ ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఇంగ్లాండ్కు పెనాల్టీ గోల్ లభించినప్పటికీ.. దాన్ని పాయింట్గా మార్చుకోలేకపోయింది. దీంతో ఆట ముగిసేవరకు ఇరుజట్ల ఖాతాలో ఒక్క గోల్ కూడా నమోదుకాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి. ఇంగ్లండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం పూల్ డీలో ఇంగ్లాండ్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. పూల్ డీలో అంతకుముందు జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ 5- 1 గోల్స్ తేడాతో వేల్స్ పై విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ